గంభీరావుపేట ఏప్రిల్ 15(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
నర్మాల ఎంపీ యూ పీ ఎస్ ప్రభుత్వ పాఠశాలలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో తప్పిన పెను ప్రమాదం. పూర్తి వివరాల్లోకి వెళితే గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో ఎంపీయుపిఎస్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం మంచినీటి బోరు మోటరు కి సంబందించిన షాటర్ సర్క్యూట్ పేలడంతో షాటర్ నుంచి మంటలు లేవడం జరిగింది మరియు షాటర్ పూర్తిగా కాలి పోవడం జరిగింది.అదే సమయంలో అక్కడ ఉన్న గొర్రె కిషోర్ వెంటనే విద్యుత్ లైన్ మెయిన్ శ్రీ శైలం కి ఫోన్ చేయడం తో వెంటనే లైన్ మెయిన్ సంఘటన స్థలానికి చేరు కొని ఏమి ప్రమాదం జరగకుండా మంటలు ఆర్పడం జరిగింది.సాయంత్రం వేళ లో షాటర్ పేలడంతో ఎవరికీ ఏమి ప్రమాదం జరగలేదు.లైన్ మెయిన్ విద్యుత్ తీగలకు విద్యుత్ రాకుండా చేయడంతో ఎవరికీ ఏమి ప్రమాదం జరగలేదని సంఘటన స్థలం లో ఉన్న వారు తెలిపారు.
వెంటనే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మోహన్ కి గ్రామస్తుడు ఐన కిషోర్ ఫోన్ చేసి ఉదయం పాఠశాలలో విద్యార్థులకు మంచినీటి కోసం నూతన షాటర్ ఫిట్ చెయ్యాలని విద్యార్థులకు ఏమి ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు.