Home తాజా వార్తలు శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం

by V.Rajendernath

అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం .

సరైన పత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు,02 ఆటో ,05 కార్ లు స్వాధీనం.

డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి

గంభీరావుపేట ఏప్రిల్ 15:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్):

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు సిరిసిల్ల డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మన్నపేట గ్రామంలో సోమవారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు.ఈ సందర్భంగా డిఎస్పీ చంద్ర శేఖర్ మట్లాడుతు ప్రజల రక్షణ గురించి ప్రజలలో భద్రతాభావం సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి మరియు ప్రజల యొక్క సమస్యలు నేరుగా తెలుసుకొనే అవకాశం ఉంటుందని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. పట్టణ,గ్రామంలో, కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని, నేర రహిత గ్రామలుగా చేయలనే జిల్లా ఎస్పీ ఉద్దేశ్యం తోనే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపినారు. అదేవిధంగా మాదక ద్రవ్యాలను, గంజాయి వంటి మత్తు పదార్థాలను, పేలుడు పదార్థాలను నివృత్తి చేయగల జాగిలల చే విస్తృత తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎలాంటి పేపర్లు లేని, సరైన నంబర్ ప్లేట్స్ లేని 32 ద్విచక్ర వాహనాలు,02 ఆటో లు ,05 కార్ లు సీజ్ చేయడం జరిగిందని ,సబంధించిన వాహన దారులకు సరైన పాత్రలు చూపించి వాహనాలు తీసుకవేళ్ళవచ్చు అన్నారు.
వాహనాలు నడిపే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వారి యొక్క వాహనాలకు ఆర్ సి, ఇన్సూరెన్స్, మరియు డైవింగ్ లైసెన్స్ కలిగివుండాలని తెలిపారు.ఒక లీటర్ గుడుంబా,40 లీటర్ల వాష్ అక్రమంగా ఇంట్లో నిల్వ ఉంచిన కోమణి పై కేసు నమోదు చేసి గుడుంబా, వాష్ సీజ్ చేయడం జరిగింది.గ్రామాల్లో ఎవరైనా అనుమానస్పదంగా తిరుగుతూ వుంటే వెంటనే పోలీసుల కు ఫోన్ చేయాలని లేదా డయల్ 100 కాల్ కు ఫోన్ చేసినాచో వెంటనే చర్యలు చేపడతాం అన్నారు.
గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ. కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో,నేరాల నియంత్రణ లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమం తరుచుగా నిర్వహిస్తామని,చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అయిన గాంజా, గుడుంబా రవాణా మరియు విక్రయాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో సి.ఐ శ్రీనివాస్ గౌడ్ ఎస్.ఐ లు పోలీస్ సిబ్బంది, కేంద్ర బలగాలు ,
జిల్లా గార్డ్ సిబ్బంది,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

You may also like

Leave a Comment