ఎల్లారెడ్డి, ఏప్రిల్ 10:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )
ఎల్లారెడ్డికి చెందిన బీఆర్ఎస్ నేతలైన ఎల్లారెడ్డి సొసైటీ డైరెక్టర్ లక్ష్మణ్ నాయక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తిరుపతి బుధవారం రాత్రి 10గంటలకు కామారెడ్డి లోని ఎమ్యెల్యే మదన్ మోహన్ స్వగృహంలో ఎమ్యెల్యే మదన్ మోహన్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్యెల్యే పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరి వెంట కాంగ్రెస్ నాయకులు చెన్నలక్ష్మన్, సాయిరాంగౌడ్, బాలర్జున్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, నాగం సాయిబాబా, అనిల్ నాయక్, బిట్ల సురేందర్ వున్నారు.