45
మహబూబాబాద్, ఏప్రిల్ 8:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో) మహబూబాబాద్ జిల్లా నెల్లికూదుర్ మండలం కాచికల్ గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్. మురళీ నాయక్ తన సొంత నిధులతో రెండు బోర్ వెల్ వేయించారు. ఈ మేరకు సోమవారం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు ఇట్టె దేవేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ గుగులోత్ శ్రీను లు బోర్ బెల్ పనులకు పూజ చేసి ప్రారంభించారు. రెండు బోర్ లలో కూడా పుష్కలంగా నీరు పడడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.