Home తాజా వార్తలు శ్రమదాన కార్యక్రమంలో యువత భాగస్వాములు కావడం అభినందనీయం…                   జిల్లా కలెక్టర్ జితేష్. వి.పాటిల్

శ్రమదాన కార్యక్రమంలో యువత భాగస్వాములు కావడం అభినందనీయం…                   జిల్లా కలెక్టర్ జితేష్. వి.పాటిల్

by V.Rajendernath

కామారెడ్డి, ఏప్రిల్ 6:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో) నాగన్న బావిలో పూడికతీత పనులకు శ్రమదానం చేయడానికి యువత ముందుకు రావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. లింగంపేట మండల కేంద్రంలోని నాగన్న బావిలో శనివారం ఉదయం మండల స్థాయి అధికారులు, ఉపాధి, ఐకెపి సిబ్బందితో కలిసి రెండు గంటల పాటు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పూడికతీత పనులకు శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పురాతన కట్టడాలను పరిరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. బావిలో పూడిక తీయడం వల్ల ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు సమృద్ధిగా పెరుగుతాయని చెప్పారు. నాగన్న బావిని పర్యటక కేంద్రాన్ని మార్చడానికి కృషి చేస్తానని తెలిపారు. మండల స్థాయి అధికారులు, యువకులు ఉత్సావంగా స్వచ్ఛందంగా శ్రమదానంలో పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సమీపంలో మొక్కలు నాటారు. ఎంపీడీవో నరేష్, తాసిల్దార్ నరేందర్, ఐకెపి ఎపిఎం శ్రీనివాస్, ఏపీవో అన్నపూర్ణ, పంచాయతీ కార్యదర్శి శ్రావణ్ కుమార్, ఉపాధి హామీ, రెవెన్యూ అధికారులు, యువకులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment