కామారెడ్డి, ఏప్రిల్ 2:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని మంగళవారం ప్రెస్ క్లబ్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా శివరాం రవీందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా పాండురంగ శర్మ, కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా వీరప్ప, కొప్పుల గంగాధర్, మేకల సాయిలు, కోశాధికారిగా గాండ్ల శ్రీనివాస్, లీగల్ అడ్వైజర్ గా ఆనంద్, సలహాదారుగా శివకుమార్ ను కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పాండురంగ శర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బాన్సువాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా రవీందర్ గౌడ్
76