37
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 1:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)
ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి కొత్త హన్మాండ్లు క్రాసింగ్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి చిలుక సత్యనారాయణ మృతి చెందగా, కుమారుడు మధు గాయపడినట్లు ఎస్ఐ. బొజ్జ మహేష్ తెలిపారు. సోమవారం ఉదయం ఎస్ఐ. మాట్లాడుతూ. బైక్ పై తండ్రి కొడుకులు వెళ్తుండగా, బైక్ అదుపు తప్పి బోధన్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.