14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన రౌస్ అవెన్యూ కోర్టు.
న్యూఢిల్లీ, మార్చి 26:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు సోమవారం 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించిన రౌస్ అవెన్యూ కోర్టు. కవితకు తీహార్ జైలుకు పంపనున్న అధికారులు. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ ఏప్రిల్ 1న విచారణ కవితకు ఏప్రిల్ 9 వరకు జ్యూడిషల్ రిమాండ్ చేసిన కోర్టు.ఇది మనీ లాటరింగు కేసు కాదు ..అని పొలిటికల్ ల్యాండ్ రింగ్ కేసు అంటూ ఎమ్మెల్సీ కవిత కోర్టు ఆవరణలో మీడియాతో వెల్లడించారు .తాను కడిగిన ముత్యాల బయటకు వస్తానని కోర్టు హాల్లో వస్తుండగా వెల్లడించారు . కోర్టు హాల్లో కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడారు .కుమారునికి పరీక్షల షెడ్యూల్ విడుదల అయినందువలన, తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత తరఫున న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. జై తెలంగాణ….జై కేసీఆర్ అంటూ కోర్టులకు వచ్చే ముందు ఎమ్మెల్సీ కవిత నినాదాలు చేశారు..