ఎల్లారెడ్డి, మార్చి 25:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కళ్యాణిపేట్ గ్రామంలో సోమవారం ప్రజలు హోలీ పండగను ఘనంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ హోలీ ఆనందాన్ని పంచుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పిల్లలు, యువకులు, వృద్ఫులు, మహిళలు హోలీని ఎంజాయ్ చేశారు. గ్రామ యువకుడు గుండ అరవింద్ మాట్లాడుతూ, తమ తాతల కాలం నుండి కల్యాణిలో హోళీ ఆడుతున్నారని, హోలికి ముందు రోజు కామదహనం నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రేమాను రాగలకు హోళీ ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఉదయం నుండి 12గంటలవరకు రంగులు చల్లుకుంటూ ప్రతి ఏటా హోళీ ఎంజాయ్ చేస్తాం అన్నారు.
కళ్యాణి గ్రామంలో అట్టహాసంగా హోలీ
46
previous post