Home తాజా వార్తలు ఎన్నికల కోడ్ ఉన్న ఇంటి స్థలాలు మంజూరు ఐ & పి ఆర్ కమిషనర్.       విజయకుమార్ రెడ్డి.

ఎన్నికల కోడ్ ఉన్న ఇంటి స్థలాలు మంజూరు ఐ & పి ఆర్ కమిషనర్.       విజయకుమార్ రెడ్డి.

by V.Rajendernath

జర్నలిస్ట్ ల ఇండ్ల స్థలాల పథకం కేబినెట్ ఆమోదం పొందింది.

విజయవాడ, మార్చి 13:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)ఎన్నికల కోడ్ ఉన్న జర్నలిస్టులకు ఇంటి స్థలాలు మంజూరు చేస్తామని ఐ & పి ఆర్ కమిషనర్ విజయకుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం
ఐ &పిఆర్ కమిషనర్ విజయకుమార్ రెడ్డి ని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జాప్), టీజేఏ ఫౌండర్ , ఎన్ యు జె (ఐ)మాజీ అధ్యక్షులు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఉప్పల లక్ష్మణ్ , జా ప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వెలివెల సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఆయన తో ఇంటి స్థలాల గురించి మరి కొన్ని జర్నలిస్టుల అంశాల గురించి చర్చించగా, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన కూడా జర్నలిస్ట్ లకు ఇంటి స్థలాలు మంజూరు చేయవచ్చని, అని సమాచార శాఖ కమీషనర్ విజయకుమారరెడ్డి వెల్లడించారని సూర్యనారాయణరెడ్డి తెలిపారు. ఇడ్ల స్థలాల స్కీం క్యాబినెట్ ఆమోదము పొంది ఉంది కాబట్టి, ఆ స్కీం కొనసాగింపు ఉంటుందని ఎన్నికల కోడ్ వచ్చిన ఈ ప్రక్రియకు అవరోధం ఉండదన్నారని వెల్లడించారన్నారు. ప్రతి జిల్లాలో మొదటగా ప్రభుత్వ భూములను ఉన్నాయా లేదా అని పరిశీలిస్తున్నారని, ఈ ప్రక్రియలో భాగంగా కొన్ని జిల్లాలలో ప్రభుత్వ భూములు గుర్తించామని, ప్రభుత్వ భూములు జర్నలిస్టులకు ఉపయోగకరంగా లేని చోట్ల, జర్నలిస్టులకు ఉపయోగకరమైన చోట ప్రైవేటు భూములను కొనుగోలు చేసి అర్హత గల ప్రతి జర్నలిస్టులకు ఇంటి స్థలాలు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన ఈ సమావేశంలో వివరించారు. అన్ని జిల్లాలలో ఇంటి స్థలాలు ఇవ్వడము జరుగుతుంది అని కమీషనర్ తెలిపారరిణి, జర్నలిస్ట్ హెల్త్ స్కీం ను కూడా జర్నలిస్ట్ లు ఉపయోగించుకోవాలని చెప్పారన్నారు. అక్రిడిటేషన్ లలో అన్యాయము జరిగి ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలని కోరారు.
సుమారు 13,000 మంది ఇండ్లస్థలాల అప్లికేషన్లు ఆన్లైన్లో దరఖాస్తు చేయగా, అందులో సుమారు 6000 మందికి మాత్రమే అర్హత పొంది ఉన్నారని తెలిపరన్నారు. లేబర్ కమిషనర్ శేషగిరి బాబును కలిసి యూనియన్ కు సంబంధించి, పలు విషయాలు చర్చించడం జరిగిందన్నారు.

You may also like

Leave a Comment