Home తాజా వార్తలు ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే సౌండ్ పార్టీ ఆహా లో విడుదల

ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే సౌండ్ పార్టీ ఆహా లో విడుదల

by V.Rajendernath

హైదరాబాద్, మార్చి 7:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)మహా శివరాత్రి కానుకగా గురువారం అర్థరాత్రి నుంచి తెలుగు బిగ్గెస్ట్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా లో స్ట్రీమింగ్ కానున్న సౌండ్ పార్టీ మూవీ. ఈ చిత్ర రచన – ద‌ర్శ‌కత్వం సంజ‌య్ శేరి.

ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై వీజే స‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌గా రూపొందిన చిత్రం సౌండ్ పార్టీ. జయ శంకర్ సమర్పణలో  సంజ‌య్ శేరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు. గతేడాది నవంబర్ 24న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూత్ దగ్గర నుంచి ఫ్యామిలీ ఆడియెన్స్ వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరించింది. తాజాగా ఓటీటీలోనూ రీ సౌండ్ చేయడానికి ఈ సినిమా సిద్ధమయింది. తెలుగు బిగ్గెస్ట్ ఓటిటి ప్లాట్ ఫామ్ అయినా ఆహా లోకి సౌండ్ పార్టీ చిత్రం వచ్చేసింది. మహాశివరాత్రి కానుకగా నేటి అర్ధరాత్రి నుంచి సౌండ్ పార్టీ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

You may also like

Leave a Comment