కామారెడ్డి, ఫిబ్రవరి 19:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి సెగ్మెంట్ లింగంపేట్ మండలంలోని ఐలపూర్ గ్రామస్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చత్రపతి శివాజీ మహారాజ్ 394 జయంతి సందర్భంగా, ఐలాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన శివాజీ నూతన విగ్రహ ఆవిష్కరణ ను ప్రముఖ శాస్త్రవేత్త, రాష్ట్ర బీజేపీ నాయకుడు పైడి ఎల్లారెడ్డి సోమవారం ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో అఖండ భారతదేశంగా చూడాలన్న సంకల్పంతో మొగలిలతో సుల్తానీలతో యుద్ధం చేయడం జరిగిందన్నారు. శివాజీ భారీ విగ్రహాన్ని పైడి ఎల్లారెడ్డి వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ చేసిన శాస్త్ర వేత్త డాక్టర్. పైడి ఎల్లారెడ్డి
61
previous post