Home తాజా వార్తలు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి పత్రికా స్వేచ్ఛ హరించడమే ఎన్ యు జె (ఐ)కార్యదర్శి వి.రాజేందర్ నాథ్

ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడి పత్రికా స్వేచ్ఛ హరించడమే ఎన్ యు జె (ఐ)కార్యదర్శి వి.రాజేందర్ నాథ్

by V.Rajendernath

అనంతపురం, ఫిబ్రవరి 18:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)అనంతపురం జిల్లా రాప్తాడు సీఎం. జగన్ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పై అక్కడి వైసిపి నాయకులు,  కార్యకర్తలు చేసిన దాడి
పత్రికా స్వేచ్ఛను హరించడమే అని ఎన్ యు జె (ఐ)కార్యదర్శి
ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్ అన్నారు. జర్నలిస్ట్ పై జరిగిన దాడిని ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, తీవ్రంగా ఖండించారు. జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిని అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన ప్రజాప్రతినిధుల ఎదుటే జర్నలిస్టులపై దాడుల జరిగితే ఎలా అని ప్రశ్నించారు. చట్టాన్ని చేతుల్లో తీసుకునే అధికారం ఎవ్వరికీ లేదన్నారు.   సాక్షాత్తు ముఖ్యమంత్రి పాల్గొన్న ఈ మహాసభలో వేలాదిమంది ఎదుటే దాడి జరుగుతుంటే ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు.   ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్లిన ఫోటోగ్రాఫర్ పై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి సంఘటనలపై అన్ని జర్నలిస్ట్ సంఘాలు ఏకమై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.   ప్రభుత్వాలు ఏదైనా పాత్రికేయులపై ఇలాంటి దాడులు చేయడం అమానుషమన్నారు.

You may also like

Leave a Comment