ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 11:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణలోనే కాకుండా నేర పరిశోధనలో ప్రజల సహకారం బాగుందని ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసులు అన్నారు. ఆదివారం ముత్యపు రాఘవులు పెంటయ్య ఫంక్షన్ హాల్ లో పట్టణ ప్రముఖులు కొందరు డిఎస్పీని సత్కరించారు. ఈ సంధర్బంగా డిఎస్పీ మాట్లాడుతూ, ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో డిఎస్పీ గా పని చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తన పోలీస్ డ్యూటీ సర్వీస్ మొత్తం ఎస్ఐ నుండి సిఐ వరకు హైదరాబాద్ లోనే చేయడం జరిగిందని, డిఎస్పీ గా ఎల్లారెడ్డికి రావడం జరిగిందన్నారు. ఎల్లారెడ్డి ప్రాంత ప్రజల మనస్తత్వం చాలా మంచిదన్నారు. పని చేసే అధికారులకు ఇక్కడ మంచి విలువ దొరుకుందన్నారు. డివిజన్ పరిధిలో నేరాల నియంత్రణతో పాటు కేసుల పరిశోధన తీరు పట్ల డిఎస్పీ కృషికి ప్రముఖులు ఈ సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు ముత్యపు వీరేశలింగం, ప్రముఖ జనరల్ సర్జన్ డాక్టర్. నాగేశ్వర్ రావు, రాజులు, సేట్, ఆత్మకూరు మాజీ సర్పంచ్ బాల్ రెడ్డి, పుండరి వెంకన్న, రిటైర్డ్ డిఫెన్స్ అధికారి కుంట రాఘవరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ ఎన్ యుజె(ఐ)కార్యదర్శి ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్, రుద్రుర్ తహశీల్దార్ వెంకటేశం, బాలరాజ్, కిషన్ సెట్, గోపాల్, ఓర శ్రీనివాస్, ఆకుల దుర్గయ్య, పద్మ చంద్ర శేఖర్, ముస్త్యాల రమేష్, ముస్త్యాల సుధాకర్, ఎంసాని సుధాకర్, కాపర్తి కిషన్, ఎర్ర శ్రీను, గంగాధర్, ఓర వీరేశం, ఆకుల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
నేరాల నియంత్రణ లో ప్రజల సహకారం బాగుంది….ఎల్లారెడ్డి డిఎస్పీ శ్రీనివాసులు
111