Home తాజా వార్తలు రాష్ట్రంలో “జాప్” యూనియన్ అతిపెద్ద యూనియన్ అయ్యేలా సమన్వయంతో కృషి చేద్దాం… విశాఖ జిల్లా జాప్ అధ్యక్షులు సింగంపల్లి శ్రీనివాస్

రాష్ట్రంలో “జాప్” యూనియన్ అతిపెద్ద యూనియన్ అయ్యేలా సమన్వయంతో కృషి చేద్దాం… విశాఖ జిల్లా జాప్ అధ్యక్షులు సింగంపల్లి శ్రీనివాస్

by V.Rajendernath

విశాఖపట్నం, ఫిబ్రవరి 10:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)విశాఖ జిల్లాలో జర్నలిస్ట్ అసోసియేషన్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్(జాప్) యూనియన్ బలోపేతం చేసి, రాబోవు రోజుల్లో ఉగాది సంబరాల కార్యక్రమం ఘనంగా నిర్వహిద్దామని అందుకు మనందరం సమన్వయంతో కలిసి పనిచేద్దామని విశాఖ జిల్లా జాప్ అధ్యక్షులు సింగంపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శనివారం విశాఖ కాంప్లెక్స్ వద్ద ప్రైవేటు కార్యాలయంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ విశాఖ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగినది. ఈ సమావేశంలో అధ్యక్షులు ప్రతి సభ్యునికి భరోసా కల్పిస్తుందని, సింగపల్లి మాట్లాడుతూ రాబోవు రోజుల్లో యూనియన్ ఆధ్వర్యంలో ఉగాది పండుగ సంబరాలు కార్యక్రమాలు జరుపునున్నామన్నారు. యూనియన్ ప్రతినిధి యలమంచిలి ఆదినారాయణ మాట్లాడుతూ, జర్నలిస్ట్ లకు ఇన్సూరెన్స్ సౌకర్యం కోసం కృషి చేస్తాం అన్నారు. జాప్ యూనియన్ రాష్ట్రంలో అతి పెద్ద జర్నలిస్ట్ యూనియన్ గా ఎదిగేలా ప్రతి ఒక్కరి కృషి అవసరం అన్నారు. ల్ యూనియన్ తరపు నుంచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కెఎం కీర్తన్, గౌరవ అధ్యక్షులు అప్పల రాజు కోషాధికారి చిరికీ నాయుడు, ఉపాధ్యక్షులు కృష్ణ, జాయింట్ సెక్రెటరీ వడ్డాది వెంకటేష్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాపర్తి శ్రీనివాసరావు, కార్యవర్గ సభ్యుడు కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment