Home తాజా వార్తలు ఆపరేషన్ నిమిత్తమై మహిళకు ఓ నెగిటివ్ రక్తం సకాలంలో అందజేతరక్తదాతను అభినందించిన ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు

ఆపరేషన్ నిమిత్తమై మహిళకు ఓ నెగిటివ్ రక్తం సకాలంలో అందజేతరక్తదాతను అభినందించిన ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు

by V.Rajendernath

కామారెడ్డి, ఫిబ్రవరి 4:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై లక్ష్మి (42) మహిళకు అత్యవసరంగా ఓ నెగెటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిది కేంద్రాలలో లభించకపోవడంతో రెడ్డిపేట్ గ్రామానికి చెందిన ప్రశాంత్ గౌడ్ మానవతా దృక్పథంతో స్పందించి, సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణదాతగా నిలిచాడని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎంతో మంది రక్తదాతలు ప్రతిరోజు ఆపదలో ఉన్న వారికి రక్తాన్ని అందజేయడం జరుగుతుందని,రక్తదానం చేసిన ప్రతి రక్తదాత ప్రాణదాతనే అని అన్నారు. యువకులు రక్తదానం పట్ల అవగాహనను పెంచుకొని ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయడానికి ముందుకు రావాలన్నారు. రక్తదాత ప్రశాంత్ గౌడ్ కు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ రాజన్నల తరఫున అభినందనలు తెలియజేశారు.

You may also like

Leave a Comment