55
కామారెడ్డి, ఫిబ్రవరి 3:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో) పొలం తగాదా విషయమై సొంత చిన్నాన్న అని చూడకుండా, అన్న కొడుకు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినట్లు ఎస్ఐ. బొజ్జ మహేష్ తెలిపారు. ఎల్లారెడ్డి మండలంలోని సాతెల్లి గ్రామానికి చెందిన సదానందం అనే వ్యక్తిపై తన అన్న కొడుకు ప్రవీణ్ శనివారం గొడ్డలితో దాడిచేసి గాయపరిచాడని తెలిపారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ. తెలిపారు.