Home తాజా వార్తలు శ్రీ కల్కి భగవాన్ ఆలయంలో మంగళవారం సందర్భంగా అన్నదానం…

శ్రీ కల్కి భగవాన్ ఆలయంలో మంగళవారం సందర్భంగా అన్నదానం…

by V.Rajendernath

కామారెడ్డి, జనవరి 23:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి నగర్ లో గల శ్రీ కల్కి భగవాన్ ఆలయంలో మంగళవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నేటి అన్నదాన కార్యక్రమానికి అన్నదాతలుగా కీర్తిశేషులు పాత రాజయ్య గారి కుమారుడు పాత నిఖిల అశ్విన్ మరియు పాత లక్ష్మణ్ మమత దంపతులు ముందుకు రావడం జరిగింది.

గడిచిన మూడు సంవత్సరాలుగా ఆలయంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నదానానికి సహకరించిన అన్నదాతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని అమ్మ భగవానుల సూచనల మేరకు ప్రతి మంగళవారం ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుందని అన్నదానం చేయాలనుకున్న భక్తులు ఆలయంలో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ సేవకులు ఎర్రం చంద్రశేఖర్,కొమిరిశెట్టి దిగంబర్,శ్రీనివాస్,ఐవి ఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు ,ఎర్రం విజయ్,వినోద్ లు పాల్గొనడం జరిగింది.

You may also like

Leave a Comment