నిజాంసాగర్ జనవరి 12,( తెలంగాణ ఎక్స్ ప్రెస్):

నిజాంసాగర్ మండలంలోని వెల్గనూర్ గ్రామ శివారులో గల మహిషాసురమ్మ ఆలయం వద్ద శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా కేకును ఎమ్మెల్యే కట్ చేసి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు తినిపించి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మల్లికార్జున్, నాయకులు రామలింగం,సవాయిసింగ్, కిష్టారెడ్డి,లక్ష్మారెడ్డి, వీరారెడ్డి,బంజ బసప్ప,సంపత్ రెడ్డి,ఆకాష్,మాజీ ఎంపిటిసి తాటిపల్లి సరస్వతి దేవి తదితరులు పాల్గొన్నారు