కామారెడ్డి, డిసెంబర్ 31:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)ప్రజల సంతోషాలే మనకు వేడుకలు అని కామారెడ్డి జిల్లా ఎస్పీ సిందు శర్మ శనివారం మీడియాకు పంపిన ప్రకటనలో పేర్కొన్నారు. నిత్యం సవాళ్లతో కూడుకున్న పోలీసు వృత్తికి ఏరోజుకారోజు కొత్తదనం ఉంటుందని, ప్రజల సంతోషాలే మనకు వేడుకలు అవుతాయన్నారు. 2024 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఒక ఏడాది కాలంలో మన జయాపజయాలను బేరీజు వేసుకుని మరింత ఉత్సాహంగా పని చేసేందుకు ప్రణాళికలు రూపొందించుకుందామని, నిన్నటికన్నా మెరుగైన ఫలితాలు రాబట్టుకునేందుకు, వృత్తి నైపుణ్యాలకు మెరుగు పెట్టుకోవడం, ఆచరణలో పెట్టడానికి ఇటువంటి సందర్భాలను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. జిల్లా ప్రజలు పోలీసు శాఖ పట్ల స్నేహపూర్వకంగా ఉండడం ఎంతో సంతోషకరమని, ఈ బంధాన్ని పటిష్టపరచడంలో మనం నిరంతరం కృషి చేద్దామని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో గతేడాది సాధించిన ఉత్తమ ఫలితాలకు సిబ్బంది చేసిన కృషి అద్వితీయమని, లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు వెళదామని ఎస్.పి పిలుపునిచ్చారు. పోలీసు సిబ్బంది, కుటుంబాలు, జిల్లా ప్రజలు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే జిల్లా ప్రజలతో పాటు ప్రజాప్రతినిదులకు, పాత్రికేయులకు పోలీసు శాఖతో సమన్వయంగా పనిచేసే అన్నీ శాఖల అధికారులకు, సిబ్బందికి 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు.
ప్రజల సంతోషాలే మనకు వేడుకలుజిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపినజిల్లా ఎస్.పి.సిహెచ్.సింధు శర్మ
40
previous post