36
హైదరాబాద్, డిసెంబర్ 25:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)ఎన్ఆర్ఐల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తా అని ఎల్లారెడ్డి ఎమ్యెల్యే కె.మదన్ మోహన్ రావు అన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ నగరంలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నిర్వహించిన ఎన్నారై మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును సభ్యులు సత్కరించారు. ఎమ్యెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధికి ఎన్నారైలు తమ వంతు సహకారాన్ని అందించాలని, ప్రభుత్వం మీకు సహకరిస్తుందన్నారు.