Home తాజా వార్తలు కేసీఆర్ కుటుంబానికే లబ్ది చేకూర్చిన కాళేశ్వరం ప్రాజెక్టు. తెలంగాణలో అధికారంలో వస్తే అవినీతి డబ్బు కక్కిస్తాం. ఆరు గ్యారెంటిల అమలుకే తొలి సంతకం. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ

కేసీఆర్ కుటుంబానికే లబ్ది చేకూర్చిన కాళేశ్వరం ప్రాజెక్టు. తెలంగాణలో అధికారంలో వస్తే అవినీతి డబ్బు కక్కిస్తాం. ఆరు గ్యారెంటిల అమలుకే తొలి సంతకం. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ

by V.Rajendernath

(వి.రాజేందర్ నాథ్)

హైదరాబాద్, నవంబర్ 26:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించింది కేసీఆర్ కుటుంబానికే లబ్ది కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, తెలంగాణలో అధికారంలో వచ్చిన వెంటనే అవినీతి డబ్బు కక్కించి,
ఆరు గ్యారెంటిల అమలుకే తొలి సంతకం చేస్తారని
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ విజయోత్సవ సభలో పాల్గొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతూ, కేసీఆర్ అవినీతితో కూడబెట్టిన డబ్బును కక్కించి ప్రజలకు అందించేలా చేస్తాం అన్నారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం లోప భూయిష్టంగా ఉందన్నారు. తను స్వయంగా ప్రాజెక్టు ను పరిశీలిస్తే, ఎక్కడికక్కడ పగుళ్లు ఉన్నాయన్నారు. ప్రాజెక్ట్ రీ డిజైన్ చేసింది కేసీఆర్ కుటుంభం లబ్దికే అన్నారు. నిరుద్యోగులను కేసీఆర్ గాలికి వదిలేశారని, పరీక్షల వరకు వెళ్లి పరీక్షల రద్దుతో నిరుద్యోగుల జీవితాలు తలకిందులు అవుతున్నయన్నారు. కేటీఆర్, కేసీఆర్ కుటుంభం సభ్యులకు తెలంగాణలో ఉద్యోగాలని ఎద్దేవా చేశారు. ఆనాడు కాంగ్రెస్ వేసిన రోడ్లపై కేసీఆర్ తిరుగుతున్నారని, అలాగే కాంగ్రెస్ కట్టిన యూనివర్సిటీల్లో కేసీఆర్ చదువుకోవడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కేసీఆర్ కు కన్పించదన్నారు. దళిత బంధుతో దళితులు బాగుపడలేదు, కేసీఆర్ కుటుంభం బాగు పడిందన్నారు.
అధికారంలో వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం అన్నారు. మహిళలకు ప్రతినెల 2,500రూపాయలు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని, 1200రూపాయల సిలిండర్ 500కు ఇస్తామని, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు భరోసా పథకంతో ఎకరానికి 15000రూపాయలు, ఏడాదికి ప్రతి రైతుకు 12000రైతు ఖాతాలో వేస్తాం అన్నారు. ఇల్లులేని వారికి 5లక్షలు, తెలంగాణ సాధనలో అమర వీరుల కుటుంబాలకు 250గజాల ఇంటి స్థలం, విద్య భరోసా కార్డు అందిస్తాం, కోచింగ్ కోసం విద్యార్ధులకు 5లక్షలు ఇస్తాం అన్నారు. ప్రతి మండలానికి ఒక ఇంటర్ నేషనల్ స్కూల్ మంజూరు చేస్తాం అన్నారు. ప్రతి వితంతువుకు, వికలాంగులకు, వృద్ధులకు 4000రూపాయల పింఛన్లు ఇస్తాం అన్నారు.

మోడీ కేసీఆర్ ఇద్దరు ఒక్కటే

మోడీ , కేసీఆర్ ఇద్దరు ఒక్కటే అని అన్నారు. లోకసభ బిల్లుల ఆమోదంలో కేసీఆర్ సహాయం మోడీ తీసుకున్నరన్నారు. నల్ల రైతు చట్టం, జిఎస్టీ తదితర బిల్లులకు కేసీఆర్ మోడీకి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. తనపై మోడీ 24కేసులు పెట్టి, తన లోక్ సభ సభ్యత్వం లాక్కొని, తన ఇంటికి తీసుకున్నారన్నారు. 55గంటల ఈడీ దర్యాప్తు చేయించారని, రాత్రి 2గంటలవరకు దర్యప్తు పేరుతో ఉంచేవారని అన్నారు. కేసీఆర్ అక్రమ ఆస్తుల జోలికి ఈడీ, సిబిఐ ఎందుకు పోవడంలేదంటే, మోడీ, కేసీఆర్ స్నేహమే కారణం అన్నారు. తెలంగాణలో ముందు 2శాతం ఓట్లు సాధించుకోమని మోడీని ఎద్దవా చేస్తూ, బీజేపీ బీసీలకు సీఎం పదవి ఇచ్చే విషయం అప్పుడు ఆలోచించాలన్నారు. బీజేపీ మరో మిత్రుడు ఎంఐఎం అని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్ కు అడ్డుపడేందుకు ఎంఐఎం పని చేస్తుందన్నారు. రాజస్థాన్, అస్సాం, మధ్యప్రదేశ్, గోవా ఎన్నికల్లో ఎంఐఎం కాంగ్రెస్ కు ఇబ్బంది పెట్టాలని చూసారన్నారు.
గడిల నియంత కుటుంబ పాలనలో బానిస బతుకులకు చరమగీతం పాడాలంటే కాంగ్రెస్ పార్టీకీ ఓటు వేసి అత్యంత మెజారిటీ తో గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు పరిచి దేశం గర్వించదగ్గ సుపరిపాలన అందిస్తామని అన్నారు. ధరణి వెబ్సైట్ ప్రవేశ పెట్టిన కేసీఆర్ తన చుట్టాలకు , మిత్రులకు భూములు దోచి పెట్టడానికి అన్నారు.

ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే,
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్, టిపిసిసి అధ్యక్షుడు , కామారెడ్డి ఎమ్యెల్యే అభ్యర్థి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, యూసుఫ్ అలీ, బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి, జుక్కల్ కాంగ్రెస్ అభ్యర్థి తోట కాంతారావు, ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు, డిసిసి అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు , కాంగ్రెస్ నేతలు గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, అరికెల నర్సారెడ్డి, నరేందర్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, కొండల్ రెడ్డి, దేవరాజ్ గౌడ్, గోనే శ్రీనివాస్, పండ్ల రాజు, మక్సూద్ అహమద్, పాత శివకృష్ణమూర్తి, గడుగుల శ్రీనివాస్, వలిపిశెట్టి భాస్కర్, గంప ప్రసాద్, ఇంద్రకరణ్ రెడ్డి, గూడెం శ్రీనివాస్ రెడ్డి, తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment