జుక్కల్ జులై 27:-( తెలంగాణ ఎక్స్ ప్రెస్)
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న 48 గంటలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున అత్యంత అప్రమత్తతతో ఉండాలని జుక్కల్ నియోజకవర్గం ప్రజలకు ఎమ్మెల్యే హనుమాన్ సిందే తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనవసరముగా ప్రజలు బయటకు రాకపోవడం మంచిదని అత్యవసరం లేని ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిదని అన్నారు ఏదైనా ప్రమాదం ఎదురయ్యే అవకాశం ఉన్నది అని గుర్తించిన వెంటనే డయల్ 100 ద్వారా సమాచారం ఇవ్వాలని అన్నారు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, కాలువలు పూర్తి స్థాయి నీటి మట్టం తో ప్రవహిస్తున్నాయని, రెండు రోజుల్లో కురిసే భారీ వర్షాల వల్ల అవి మరింత ప్రమాద స్థాయిలో ప్రవహించే అవకాశము ఉన్నందున గ్రామ అధికారులు, సర్పంచుల ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందేలా చూసి అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా చూడాలని దానికి అవసరమగు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగిందన్నారు