జుక్కల్ , జూలై 22:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో) కామారెడ్డి జిల్లా మద్నూర్ కు చెందిన గడ్డం వారి శ్రవణ్ కుమార్ (22)బైక్ పై మద్నూర్ శివారులో శనివారం జాతీయ రహదారి 161 హైవే వెళ్తుండగా, గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. గుర్తుతెలియని వాహనం గురించి మద్నూర్ పోలీసులు స్టేషన్ ల వారిగా సమాచారం అందించి, వాహనం పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్లు సమాచారం.