హైదరాబాద్, నవంబర్ 15:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)లేడీ ఫైర్ బ్రాండ్, మాజీ ఎంపీ. సినీనటి విజయ శాంతి బుధవారం బీజేపీకి రాజీనామా చేసినట్లు విజయశాంతి ప్రకటించారు. ఈ మేరకు బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డికి రాజీనామా లేఖను పంపించారు. విజయశాంతి నాయకత్వంపై గత కొన్ని రోజులుగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీజేపీలో తనకు తగిన ప్రాధాన్యం దక్కడలేదని ఆమె అసంతప్తిలో ఉన్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్ గా బండి సంజయ్ ను తొలగించి.. కిషన్ రెడ్డిని నియమించినప్పటీ నుండి ఆమె సెలైంట్ అయిపోయారు. బీజేపీ అగ్రనేతలు మోడీ, అమిత్ షా రాష్ట్రంలో పర్యటించిన ఆమె దూరంగానే ఉంటున్నారు. బీజేపీ అగ్రనేతలు పాల్గొనే సభలకు సైతం ఆమె అంటిముట్టినట్లుగా ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలకమైన అజిటేషన్ కమిటీ చైర్మన్ గా పార్టీ నియమించిన.. చైర్మన్ హోదాలో విజయశాంతి ఒక్క కార్యక్రమం చేయక పోవడం గమనార్హం.
అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆమె బరిలోకి దిగలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ ఇటీవల ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో విజయశాంతికి చోటు దక్కలేదు. లేడీ ఫైర్ బ్రాండ్గా పేరు ఉన్న విజయశాంతికి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కీలకమైన స్టార్ క్యాంపెయినర్ లిస్ట్లో చోటు దక్కకపోవడంతో విజయశాంతి బీజేపీలో ఇమడటం కష్టం అని భావించి , బీజేపీకి రాజీనామా చేసిన విజయశాంతి ఈ నెల 16వ తేదీన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సభలో కాంగ్రెస్ పార్టీలో చేరెందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటకే కాంగ్రెస్ పెద్దలతో చర్చలు కూడా జరిగినట్లు సమాచారం . ఎన్నికల వేళ ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ విజయశాంతికి ప్రాముఖ్యత ఇవ్వనున్నట్లు సమాచారం.
బీజేపీకి రాములమ్మ (విజయశాంతి ) రాజీనామా. కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం
55