కామారెడ్డి, ఆగస్టు 25:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)కేసీఆర్ ను కామారెడ్డి సెగ్మెంట్ నుండి ఓడించి బీఆర్ఎస్ ను భూస్థాపితం చేస్తాం అని, అలాగే కామారెడ్డిలో కూడా బీఆర్ఎస్ ల్యాండ్ మాఫియా దిగుతుందని, దాన్ని కూడా అంతమోదిస్తామని, ప్రజలు స్వేచ్ఛగా జీవించే పాలన అందిస్తామని
మాజీ మంత్రి మొహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్ ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం శుక్రవారం జరిగింది.
ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ మాట్లాడుతూ,
తెలంగాణ ఉద్యమంలో తన ఆట పాటలతో ఉద్యమాన్ని ఉర్రూతలూ వుగించిన గద్దర్ లాంటి ప్రజా యుద్ధనౌకకు తొమ్మిదిన్నరేళ్లుగా ప్రగతి భవన్ గేటు దాటానివ్వని కేసీఆర్
గద్దర్ చనిపోయే ముందు చెప్పిన మాటను ప్రతి ఒక్కరు నెరవేర్చాలి.
గజ్వేల్ లో 9, 10 లక్షలిచ్చి భూములు తీసుకుని కోట్లకు అమ్ముకున్నారన్నారు.
గజ్వేల్, హైదరాబాద్ లను సీఎం కెసిఆర్ అమ్మి వేశాడు.
కామారెడ్డి ని అమ్మేసేందుకు సీఎం కెసిఆర్ కామారెడ్డి కి వస్తున్నాడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అన్నారు. కామారెడ్డి ని అమ్మేసేందుకే రింగురోడ్డు ప్రస్తావనను కెసిఆర్ తీసుకువస్తున్నాడన్నారు.
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమని మరిచిపోవద్దు.
నేనేం పీకానని కేటీఆర్ మాట్లాడారు, అరేయ్ కేటీఆర్.. నేనేం పీకానో మీ అయ్యను అడిగితే చెప్తాదు అఫిజి చూడన్నాడు. తెలంగాణపై ప్రకటన చేసేలా చూడాలని మీ అయ్య నాతో వేడుకున్నాదు, అది మరిచిపోయావ, సోనియా గాంధీతో మాట్లాడి తెలంగాణ ప్రకటన వచ్చేలా కృషి చేసి అర్ధరాత్రి ఆస్పత్రికి వెళ్లి దీక్ష విరమింపజేసిన అన్నాడు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా కామారెడ్డిలో విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు చేయించిన ఘనత నాది, భూములు అమ్ముకోవడమే కేసీఆర్ అభివృద్ధి అన్నాడు. ఇది ప్రజలు గమణిస్తున్నారన్నారు.
డబుల్ ఇళ్ల నిర్మాణంలో పైనుంచి కేసీఆర్ కు కమిషన.. కిందనుంచి ఎమ్మెల్యేకు కమిషన్
తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబంలో ఎవరైనా చనిపోయారా.. ఒక్కరైనా జైలుకు వెళ్ళారా అన్నారు.
అలాంటి వాళ్ళు తెలంగాణ తెచ్చిన వాళ్ళు అవుతారా..?
శ్రీకాంత చారి మరణం చూసి చలించిన సోనియాగాంధీ ఇంకెవరు ఆత్మహత్య చేసుకోవద్దని పార్లమెంటులో అందరి నోళ్లు మూయించి తెలంగాణ బిల్లు పాస్ చేయించారన్నారు.
అలాంటి శ్రీకాంత చారి తల్లికి కేసీఆర్ గౌరవం ఇవ్వలేదు
కల్వకుంట్ల కుటుంబానికి గతంలో ఎక్కడా ఇండ్లు లేవు.. ఇప్పుడు లక్షల కోట్లు సంపాదించుకున్నారు
గల్లీ గల్లీకి లిక్కర్ షాపులను సీఎం కేసీఆర్ తెరుస్తున్నాడు.
రాష్ట్రంలో ఎమ్మెల్సీ కవిత లిక్కర్ రాణి గా కొనసాగుతుంది.
కేసీఆర్ లిక్కర్ షాపులు పెడితే కవిత వద్ద లిక్కర్ ఏజన్సీ ఉంది
రాష్ట్రంలో ఇసుక మాఫియాను మంత్రి కేటీఆర్ నడుపుతున్నాడు.
దోచుకున్నది సరిపోలేదా కేసీఆర్.. ఇంకెంత దోచుకుంటారు
రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం 10000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఇస్తే ఐదున్నర లక్షల కోట్ల అప్పు కేసిఆర్ చేశాడు.
రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేసావని అప్పులపాలు చేసావు.
కామారెడ్డిలో పాండవులు.. కౌరవుల మధ్య భీకర యుద్ధం జరగబోతోందన్నారు.
తెలంగాణ భవిష్యత్తు మనచేతిలోనే ఉంది
కామారెడ్డి, గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడించాలన్నారు.
తెలంగాణలో నాలుగు వేల పాఠశాలలు మూసివేశారు.. ఉన్న పాఠశాలల్లో విద్యార్థులకు సౌకర్యాలు లేవన్నారు.
నా జీవితంలో ఉన్నవి రెండే కోరికలు.. తాగునీరు.. సాగునీరు
వైఎస్ఆర్ హయాంలో తాగునీరు ఇప్పించాను.. సాగునీరు కోసం 20,21,22 ప్యాకేజి కోసం రెండేళ్లలో 419 కోట్లు ఖర్చు చేసిన
9 ఏళ్లలో కేవలం 29 కోట్లు మాత్రమే కేసీఆర్ కేసీఆర్ ఖర్చు చేశారు.
కొండపోచమ్మ, మల్లన్న సాగర్ కేసీఆర్ నియోజకావర్గంలోనే నిర్మించుకున్నారు.
ఈ గడ్డమీద పుట్టిన వారిని గెలిపిస్తారా.. బయటి వారిని గెలిపిస్తారా, మీ ఇంటి మనిషిని నేను.. గెలిచినా ఓడినా మీతోనే ఉన్నాను, ఒక్కసారి ఆశీర్వదించండి.. నా సత్తా ఏంటో చూపిస్తా అన్నారు. అనంతరం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ,
గజ్వేల్ లో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏమి లేదు
నియోజకవర్గానికి 5 వేల ఇల్లు కడతామని చెప్పి గజ్వేల్ లో కేవలం 1200 ఇండ్లు మాత్రమే కట్టారన్నారు. ఆ ఇండ్లు కూడా మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు ఇచ్చారన్నారు. 5 వేల ఇల్లు కడితే ఎన్నికల్లో నామినేషన్ కూడా వెయ్యను అన్నారు.
9 ఏళ్ల నుంచి రింగు రోడ్డు కడుతూనే ఉన్నారు.. రైతుల నుంచి మాత్రం భూములు తీసుకుని ఎకరానికి 10-12 లక్షలిచ్చి కోట్లకు అమ్ముకున్నారు
అలాంటి కేసీఆర్ నేడు కామారెడ్డికి వస్తున్నాడు, నా జీవితంలో నేను చేసిన తప్పు బీఆర్ఎస్ లో చేరడమే.. మొదట్లో ఉన్న మర్యాద తరవాతి రోజుల్లో ఉండదన్నారు.
అభివృద్ధి అనేది కేసీఆర్ డిక్షనరీలోనే లేదన్నారు.
నమ్మించి మోసం చేసాడు.. అలాంటి వారిని దగ్గరకు రానివ్వద్దు
కేసీఆర్ చుక్కల్లో చంద్రుడు.. చంద్రుడు కిందకు రాడు కలవడు.. కేసిఆర్ కూడా అంతే అన్నారు.