Home తాజా వార్తలు అజ్మీర్ ఖాజా గరీబ్ నవాజ్ దర్గా ను దర్శించుకున్న మోహిన్ అహ్మద్ ఖాద్రి

అజ్మీర్ ఖాజా గరీబ్ నవాజ్ దర్గా ను దర్శించుకున్న మోహిన్ అహ్మద్ ఖాద్రి

by V.Rajendernath

అజ్మీర్, ఆగస్టు 25:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో) ఎల్లారెడ్డి సెగ్మెంట్ లింగంపేట్ కు చెందిన హైకోర్టు న్యాయవాది, రాష్ట్ర నీటిపారుదల శాఖ బోర్డ్ డైరెక్టర్ అయిన మోహిన్ అహ్మద్ ఖాద్రి అలియాస్ మోహిన్ బాబా శుక్రవారం రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ ఖాజా గరీబ్ నవాజ్ దర్గాను దర్శించుకున్నారు. దర్గాపై చదార్ , పూలు అందించి మొక్కులు మొక్కు కున్నారు. అనంతరం ఎల్లారెడ్డికి చెందిన నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్(ఇండియా) జాతీయ కార్యదర్శి ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్, ఖాద్రి ఇద్దరు అజ్మీర్లో కలుసుకున్నారు. జైపూర్ లో 26, 27తేదీల్లో జైపూర్ లో జరగనున్న ఎన్ యు జె(ఐ)జాతీయ సదస్సుకు వచ్చిన రాజేందర్ నాథ్, పలువురు జర్నలిస్ట్ లతో కలిసి పుష్కర్ తో పాటు అజ్మీర్ దర్గా కు వెళ్లారు. మోహిన్ ఖాద్రిని అక్కడే కలుసుకోవడంతో జర్నలిస్ట్ లకు అజ్మీర్ దర్గాలో ఆయన పలుకు బడితో మోహిన్ ఖాద్రి ప్రత్యేక దర్శనం చేయించారు. అజ్మీర్ దర్గాలో తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన జర్నలిస్టులను ఇక్కడ కలుసుకోవడం ఆనందంగా ఉందని ఖాద్రి అన్నారు. అజ్మీర్ లో ఖాద్రిని కలిసిన వారిలో మొహమ్మద్ ఖాసీం, మహమ్మద్ ఖాళీళ్, మొహమ్మద్ అంజాద్, హాబీబొద్దిన్, ఉమర్, రాంమోహన్ రావు, డాక్టర్. షేక్ హసీనా , దన్నారపు రాజలింగం, అమృత్ రావు, మహమ్మద్ నసీరొద్దీన్ ఖాద్రి, యూసుఫోద్దీన్ ఖాద్రి, కుమార స్వామి, సునీల్, సదాచారితో పాటు జర్నలిస్టులు వున్నారు.

You may also like

Leave a Comment