- జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మక్తల్ వాకిటి శ్రీహరి
- ముఖ్యఅతిథిగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి
మక్తల్. ఆగస్టు .24 :- (తెలంగాణ ఎక్స్ ప్రెస్): వికారాబాద్ జిల్లా తాండూర్ లో:ఈ నెల 26న జరగబోయే చేవెళ్ల భారీ భహిరంగ సభ SC ST డిక్లరేషన్ తో ముందుకు రాబోతున్న కాంగ్రెస్ పార్టీ సభకు జనసమీకరణ అంశంపై తాండూర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అదే విధంగా ఈ కార్యక్రమంలో పిసిసి వైస్ ప్రెసిడెంట్ వెంనరేందర్ రెడ్డి , కార్యక్రమ ఇంచార్జ్ మక్తల్ నియోజకవర్గ నేత నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాకిటి శ్రీహరి , వికారాబాద్ జిల్లా అధ్యక్షులు పి రామ్ మోహన్ రెడ్డి , మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ , రమేష్ మహారాజ్ , కల్వ సుజాత , జెడ్పీటీసీ ధార సింగ్ , ఉత్తం చంద్ , జనార్దన్ రెడ్డి , నియోజకవర్గ మండల అధ్యక్షులు నర్సి రెడ్డి , నాగప్ప , హబీబ్ , నరసింహులు గౌడ్ , గోపాల్ మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.