విశాఖపట్టణం, మార్చి 12:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ బ్యూరో)జర్నలిస్ట్ సమస్యలపై ఎన్ యు జె(ఇండియా) ఎప్పుడు స్పందిస్తుందని,
ఎన్ యు జె(ఐ) కార్యదర్శి ఉక్కల్ కర్ రాజేందర్ నాథ్ అన్నారు. మంగళవారం విశాఖపట్టణంలో జరిగిన ఉత్తరాంధ్ర(విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల) జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్)జాప్ సమావేశానికి గౌరవ అతిథిగా హాజరైన రాజేందర్ నాథ్ మాట్లాడుతూ, ఏపీలో జర్నలిస్ట్ లపై జరుగుతున్న దాడులను ఖండించారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఉప్పల లక్ష్మణ్ సహకారంతో యూనియన్ మరింత బలోపేతం కావాలన్నారు. జర్నలిస్ట్ ల ఇండ్ల స్థలాలు, అక్రిడిటేషన్ ల గురించి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ తో పాటు కేంద్ర ఎన్నికల నోటిఫికేషన్ రానున్న దృశ్య ఎన్నికలు కాగానే పై సమస్యలపై ప్రత్యేక దృష్టి సరిస్తాం అన్నారు. జర్నలిస్ట్ రైల్వే పాసులు వ్యవహారం పెండింగ్ లో ఉందని ఎన్నికల తరువాత ఈ సమస్యకు పరిష్కారం లభించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంద్రప్రదేశ జాప్ లో ఎలాంటి గ్రూపులు కానీ లేవని, ప్రతి జిల్లా నుండి జాప్ ను మరింత బలోపేతం చేయాలన్నారు.
జర్నలిస్టులపై దాడులు చేస్తే సహించేది లేదు
జాప్ ఫౌండర్ ఉప్పల లక్ష్మణ్
జర్నలిస్టులపై దాడులు చేస్తే సహించేది లేదని జాప్, టీజేఏ ఫౌండర్, ఎన్ యు జె (ఐ)మాజీ చైర్మన్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు ఉప్పల లక్ష్మణ్ అన్నారు. ఉత్తరాంధ్ర జాప్ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టులు వార్తలు రాస్తే దాడులు చేయడం చట్టరీత్య నేరం అని, చిత్రాన్ని ఎవరు చేతుల్లో తీసుకున్న నేరం అవుటుఉందన్నారు. ఒక జర్నలిస్ట్ రాసిన వార్తను సబ్ ఎడిటర్, ఎడిటర్, పరిశీలించి, అదే వార్త ఎవరికైనా ఎక్కువ ఇబ్బంది కలిగేలా ఉన్న సమయంలో యజమాన్యాలదృష్టికి వెళ్తాయని, అన్ని చూశాక వార్తలు వేస్తారని, కానీ ఒక జర్నలిస్ట్ రాయగానే అది నచ్చని వారు దాడులు చేయడం సరికాదన్నారు. ఒకవేళ జర్నలిస్ట్ తప్పుడు వార్త రాస్తే, అతనిపై చట్టరీత్య చర్యలు తీసుకునే అధికారం ఉంది, కానీ జర్నలిస్ట్ పై దాడి చేసి కొట్టే అధికారం లేదని, జర్నలిస్టులపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. జర్నలిస్ట్ సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, తగిన సలహాలు సూచనలు యూనియన్ పరంగా అందిస్తూనే ఉన్నామన్నారు. ఈ సమావేశంలో జాప్ రాష్ట్ర అధ్యక్షులు రవి తేజ, పెఆధాన కార్యదర్శి సూర్యనారాయణ రెడ్డి, ప్రతినిధులు సత్యనారాయణ, సగశికుమార్, గోపాల్ వర్మ, 3జిల్లాల జర్నలిస్టులు, జర్నలిస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.