54
ఎల్లారెడ్డి పెద్ద చెరువులోదూకి నిజాంసాగర్ మండలం బంజాపల్లి తాండకు చెందిన నీలశాంత (33)అనే వివాహిత ఆత్మహత్య చేసుకుందని ఎస్ఐ మహేష్ తెలిపారు. భర్తతో గొడవ పడి ఇంట్లో నుండి కూతురు వెళ్లిందని తల్లి సోనిబాయ్ రాథోడ్ శుక్రవారం నాగిరెడ్డిపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేసిందని, శనివారం ఎల్లారెడ్డి పెద్దచెరువులో నీలశాంత మృతదేహాన్నీ కనుగొన్నట్లు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.