Home తాజా వార్తలు పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిర్వహణను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ ఎండి.యూసుఫ్

పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిర్వహణను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ ఎండి.యూసుఫ్

by Telangana Express

మిర్యాలగూడ డిసెంబర్ 10: (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం నిర్వహణను మున్సిపల్ కమిషనర్ ఎండి.యూసుఫ్ మంగళవారం పరిశీలించారు. అశోక్ నగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఇస్లాంపుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియం, ఎన్ఎస్పి క్యాంపు మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండుతున్న తీరును అన్నం కూరలను పరిశీలించారు. నిర్వహణను పరిశీలించి విద్యార్థిని, విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మేను ప్రకారం విద్యార్థిని విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం వద్దించాలని కోరారు. ఆయన వెంట టీపిఓ సోమయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, హెల్త్ అసిస్టెంట్ జాఫర్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులున్నారు.

You may also like

Leave a Comment