ఎల్లారెడ్డి, నవంబర్ 26,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 7 వ వార్డులో కాలనీ ప్రజల నీటి అవసరాలను తీర్చే బోరు మోటర్ , మంగళవారం ఉదయం చెడిపోయింది. కాలనీ వాసులు స్థానిక మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ దృష్టికి తీసుకువెళ్లి, బోరు మోటర్ చెడిపోయి నీటి సమస్య ఏర్పడుతోందని వివరించగా, వెంటనే స్పందించిన చైర్మన్ పాలక వర్గ సభ్యులతో కలిసి కాలనిలో బోరు వద్దకు వెళ్లి మోటార్ చెడిపోయింది అని నిర్ధారించుకుని, నూతన బోరు మోటార్ , స్టార్టర్ ను గంటల వ్యవధిలో తెప్పించి చెడిపోయిన బోరు మోటర్ స్థానంలో ఏర్పాటు చేయించారు. మోటారు బాగాలేదని గత పది రోజుల క్రితం చైర్మన్ కాలనిలో పర్యటించినప్పుడు కాలనీ వాసులు తెలపగా పూర్తిగా పని చెకుంటే కొత్త బోరు మోటర్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. కాలనీ వాసులు కాలనీలో నీటి ఎద్దడి ఏర్పడకుండా ఇచ్చిన మాట ప్రకారం నూతన బోర్ మోటార్ ను ఏర్పాటు చేయడం పట్ల చైర్మన్ పద్మ శ్రీకాంత్, పాలక వర్గ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు ఎడ్ల కిషన్, కౌన్సిలర్ నీలకంఠం, నాయకులు నునుగొండ శ్రీనివాస్, మంచిర్యాల విద్యాసాగర్, గాదె తిరుపతి, సంగని పోచయ్య, వాటర్ వర్కర్ సిబ్బంది వెంకటి తదితరులు ఉన్నారు.