తెలంగాణ ఎక్స్ ప్రెస్ దినపత్రిక
వెల్గటూర్ జనవరి 19
వెల్గటూర్ మండలం శాఖపూర్ గ్రామంలోని మీరాల కార్తీక్ అను వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడగా అతని కాలి వేలు మరియు కంటి బొక్క విరుగగా అతని యొక్క ఆర్థిక పరిస్థితి బాగా లేనందున అతని పరిస్థితి తెలుసుకొని కార్తీక్ తల్లిదండ్రులకు ముదిరాజ్ సంఘ సభ్యులు వారికి ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. కార్తీక్ తల్లిదండ్రులు ముదిరాజ్ సంఘ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొలకాని సత్తయ్య, కొలకాని పోచయ్య, రంగం మధు, మీరాల రమేష్,మడిగేలా రవి, లచ్చయ్య, గౌరయ్య, శ్రీనివాస్, రాజయ్య, రాయాలింగు,మల్లేష్, రాజు, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

