గ్రామాల అభివృద్ధే సీఎం కేసీఆర్ గారి లక్ష్యం…
సైదాపూర్ ఆగస్టు 24
(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
సైదాపూర్ మండలంలో 10కోట్ల 42లక్షల అభివృద్ధి పనులు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు…
అభివృద్ధి పథంలో సైదాపూర్ మండలం…
ఈ తొమ్మిది ఏళ్ల పాలన దేశానికి ఆదర్శం
అన్నీ వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి కృషి..
పనిచేసే బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి…
గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి…
ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్…
సైదాపూర్:తెలంగాణ పల్లెల్లో అభివృద్ధి కుసుమాలు విరబూస్తున్నాయి.ఏండ్లతరబడి నిరాదరణకు గురైన గ్రామాలు నేడు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయి.మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యం తెలంగాణ రాష్టంలో సిద్ధిస్తోంది.గ్రామీణ తెలంగాణలో మౌళిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసి గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని హస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఈరోజు 10కోట్ల42లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కార్యక్రమాలలో ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ ముఖ్యతిధిగా పాల్గొన్నారు.మండల కేంద్రంలో రూ.25లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు అలాగే వెంకటేశ్వర్ల పల్లి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి,రూ.5లక్షల వ్యయంతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు.సర్వాయిపేట గ్రామంలో రూ.17.52లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన అనంతరం రూ.5లక్షల వ్యయంతో నిర్మించనున్న కురుమ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు, సైదాపూర్ మండలం ఘనపూర్ జడ్పీ రోడ్ నుండి రాయికల్ తండా, వయా నల్లానితండా వరకు రూ 2.80కోట్ల వ్యయంతో బీటి రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు, ఎలబోతారం ఆర్ అండ్ బి రోడ్డు నుండి అమ్మనగుర్తి వరకు బి టి రోడ్డు రెన్యువల్ కు 5కోట్ల 70లక్షల రూపాయలతో శంకుస్థాపన చేశారు, సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో బొమ్మకల్ నుండి వంగర వరకు రూ 29.50లక్షల వ్యయంతో బీటి రోడ్ రెన్యువల్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు,మండలంలోని నల్ల రామయ్య పల్లి లో 20లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనానికి భూమిపూజ అలాగే ఎలబోతారం గ్రామంలో 20లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ చేశారు,ఎక్లాస్ పూర్ గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి కేటాయించిన స్థలంలో ఆర్టీసీ స్థలం ఉందని అధికారులు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా వెంటనే ప్రత్యేక చొరవ తీసుకోని రికార్డ్ లను పరిశీలించి ఆర్టీసీ అధికారులతో మాట్లాడి స్థలాన్ని గ్రామపంచాయతీ భవనానికి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సారాబుడ్ల ప్రభాకర్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు చందా శ్రీనివాస్,వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్ రెడ్డి,సింగిల్ విండో చైర్మన్లు బిల్లా వెంకటరెడ్డి కొత్త, తిరుపతిరెడ్డి,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సోమారపు రాజయ్య,జిల్లా రైతు బంధు సభ్యులు చెలిమెల రాజేశ్వర్ రెడ్డి, మండల కో ఆప్షన్ మెంబర్ ఎండి ఇమామ్, మాజీ జెడ్పిటిసి బ్రదర్ కూడా రవీందర్ నాయకులు వీరారెడ్డి లక్ష్మీనారాయణ యువ నాయకులు స్వామి నరేష్ సురేష్ అధికారులు,పలు గ్రామాల ప్రజాప్రతినిధులు,బిర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు.

