Home తాజా వార్తలు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అగ్ని ప్రమాద ఘటనపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్ ప్రమాదంపై అధికారులతో ఆరా… ప్లాంట్ పరిశీలన

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అగ్ని ప్రమాద ఘటనపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్ ప్రమాదంపై అధికారులతో ఆరా… ప్లాంట్ పరిశీలన

by Telangana Express

మిర్యాలగూడ, ఏప్రిల్ 28,( తెలంగాణ ఎక్స్ ప్రెస్)

నల్లగొండ జిల్లా దామరచర్ల (మం) యాదాద్రి థర్మల్
పవర్ ప్లాంట్ లో సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంపై తక్షణమే స్పందించిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(బిఎల్అర్ )హుటాహుటినప్లాంట్ ను పరిశీలించి ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను ఆరా తీశారు.యూనిట్ వన్ లోని బాయిలర్ వద్ద గ్యాస్ కట్ మరమ్మత్తులు చేస్తుండగా ఒత్తిడికి గురై ఆయిల్ లీక్ కావడంతో మంటలు చెలరేగినట్లు అధికారులు వెల్లడించారు. ప్లాంట్లో మొత్తం 5 బాయిలర్లు ఉండగా,వాటిలో
మూడు బాయిలర్లు రన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని, బాయిలర్ వన్ వద్ద మినహా, మిగిలిన వాటిలో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపిన అధికారులు.త్వరితగతన ప్రమాదానికి గురైన బాయిలర్ గ్యాస్ కట్ ను రిపేరు చేయాలని అధికారులను ఎమ్మెల్యే బిఎల్ఆర్ ఆదేశించారు.బాయిలర్ రిపేరు చేసి 24 గంటల్లోపు రన్నింగ్ లోకి తీసుకువస్తా మని అధికారులు తెలిపారు. చిన్న ప్రమాదం జరిగిందని ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే బిఎల్ఆర్ తెలిపారు.

You may also like

Leave a Comment