Home తాజా వార్తలు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం ప్రకటించిన మంత్రి దామోదర్ రాజా నర్సిoహ

భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం ప్రకటించిన మంత్రి దామోదర్ రాజా నర్సిoహ

by Telangana Express

. జోగిపేట డిసెంబర్ 27:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం తెలిపారు, ఆర్థికవేత్తగా, ఆర్బిఐ గవర్నర్ గా, రాజ్యసభ సభ్యుడిగా, ఆర్థిక మంత్రిగా, దేశ ప్రధానిగా రెండుసార్లు అందించిన సేవలను స్మరించుకున్నారు, దేశం గొప్ప ఆర్థిక వేత్తను కోల్పోయింది అన్నారు, వారి మరణం దేశానికి తీరని లోటు ఉన్నారు, మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా పనిచేసిన కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందన్నారు, ఈ సందర్భంగా వారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ, మాజీ ప్రధాని పి ,వి నరసింహారావు మార్గదర్శకంలో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని సంక్షోభం నుండి గట్టెక్కించిన ఘనత మా మన్మోహన్ సింగ్ కు దక్కిందన్నారు, ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టిన ఘనత మన్మోహన్ సింగ్ గారికి దక్కిందన్నారు, దివంగత నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ఆత్మ శాంతించాలని కోరుకున్నా, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ.

You may also like

Leave a Comment