Home తాజా వార్తలు ఆటో బోల్తా పలువురికి తీవ్ర గాయాలు

ఆటో బోల్తా పలువురికి తీవ్ర గాయాలు

by Telangana Express

తెలంగాణ ఎక్స్ ప్రెస్ దినపత్రిక
వెల్గటూర్ జనవరి 11

వెల్గటూర్ మండలంలోని రాష్ట్ర రహదారిపై కిషన్ రా వు పేట్ గ్రామం వద్ద శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో బోల్తా పడి పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వెల్గటూర్ మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో చదువుతున్న పిల్లలను సంక్రాంతి సెలవులకు తీసుకెళ్లడానికి గోదావరిఖని ప్రాంతానికి చెందిన తల్లిదండ్రులు ఆటో తీసుకొని వస్తున్నారు. మార్గ మధ్యలోని కిషన్రావు పేట్ వద్ద ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కన గల విద్యుత్ స్తంభంను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 లో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

You may also like

Leave a Comment