బాన్సువాడ నవంబర్ 28(తెలంగాణ ఎక్సప్రెస్ )
మాల మహానాడు నేతలు
బాన్స్ వాడ మండలంలోని తీర్మాల పూర్ తాడ్కోల్ గ్రామంలో మాల సంగం సభ్యులతో సమావేశం నిర్వహించి మాలల సింహ గర్జన పోస్టర్లను ఆవిష్కరణ చేసిన అనంతరం బాన్సువాడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నేర్రే నరసింహులు కామారెడ్డి జిల్లా అల్ ఇండియా అంబేద్కర్ సంగం ఉపాధ్యక్షులు గైని రవి తీర్మాల పూర్ గ్రామ మాజీ సర్పంచ్ బేగరి సాయిలు అల్ ఇండియా అంబేద్కర్ సంగం డివిజన్ ఉపాధ్యక్షులు మన్నె చిన్న సాయిలు గార్లు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర మాల మహానాడు మాల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు హాజరవుతున్న బహిరంగ సభకు ప్రతి మాల కుటుంబ సభ్యుడు తరలి రావాలంటూ మాలల ఐక్యతను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అర్థమయ్యే ప్రతి ఇంటి నుండి ఒకరుగా వచ్చే విధంగా సభను విజయవంతం చేయాలని కోరడం జరిగింది
ఈ కార్యక్రమంలో తీర్మాలాపూర్ మాల సంగం అధ్యక్షులు మెకానిక్ సాయిలు తాడ్కోల్ మాజీ సర్పంచ్ రాజు మాజీ ఎంపీటీసీ సాయిలు మాల దేశాయ్ పేట్ అంబేద్కర్ సంగం అధ్యక్షులు న్యాల కంటి గంగాధర్ గ్రామ మాల సంగం పెద్దలు రాములు దుర్గయ్య సాయిలు తదితరులు పాల్గొన్నారు