Home తాజా వార్తలు ముదిరాజ్ లకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన పార్టీని హక్కును చేర్చుకుందాం

ముదిరాజ్ లకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన పార్టీని హక్కును చేర్చుకుందాం

by Telangana Express

తెలంగాణ ఎక్స్ ప్రెస్ కామారెడ్డి టౌన్ ఆగస్టు25

ముదిరాజ్ అంతా ఏకం కావాలి ఐకమత్యంతో నిరసన లు చేయాలి మేం ఎంతో మాకు అంత అంటున్న తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్టు సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతల నీలకంఠం ముదిరాజ్

ముదిరాజ్ లకు పిలుపు* .
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని R & B గెస్ట్ హౌస్ లో జరిగిన ప్రెస్స్ మీట్ భాగంగా ఆయన మాట్లాడుతూ.
రాష్ట్రంలోని అన్ని పార్టీలు ముదిరాజ్ జాతిని కించపరిచిన, అవమాన పరిచిన ఇంకా ఎంత కాలం బరించాలని తెలంగాణ ముదిరాజ్ జర్నలిస్టు సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతల నీలకంఠం ముదిరాజ్ ఆవేదన పత్రిక ముఖంగా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజు కులానికి పార్టీలు ఒక్క MLA టిక్కెట్ కూడ, కేటాయించలేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పార్టీ కి ముదిరాజ్ లు అంటే లెక్కలేదనీ.. ఇక నుండి ఆ పార్టీలను బహిరంగంగానే మన లెక్కల్లో నుండి తీసేయాలి అని పిలుపు ఇచ్చారు.
*దీనికి కారణం మరెవరో కాదు. మనమే , స్వలాభాల కు, కక్కుర్తి పడుతూ, మనకి మనమే నష్ట పరుచుకుంటున్నాం .భవిషత్ తరాల కోసం ముదిరాజ్ అన్ని సంఘం నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన అన్నారు ఏ పార్టీ ముదిరాజులకు టికెట్ ఇచ్చిన అక్కడ మన ముదిరాజులు అంతా వెళ్లి గెలిచే విధంగా కష్టపడాలని ఆయన అన్నారు ఐకమత్యంతో గెలిపించాలని కోరారు

ఈ కార్యక్రమంలో చింతల రమేష్ ముదిరాజ్
గాంధారి తూర్పు రాజు ముదిరాజ్, విద్యార్థి సంఘం అధ్యక్షుడు నీల నాగరాజు ముదిరాజ్ .
. కామారెడ్డి పట్టణ పెద్దమ్మ వాడ ఏ సభ్యులు చింతల శ్రీనివాస్ ముదిరాజ్ జంగిటివాడ సభ్యులు రాజు ముదిరాజ్ ఆశయ ముదిరాజ్ లు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment