Home తాజా వార్తలు ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

by Telangana Express

మొదటి రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతం….”ఎ,బి” రెండు కేంద్రాల్లో కలిపి 20 మంది గైర్హాజరు… – పరీక్షల సీఎస్ డీఓ లుఎల్లారెడ్డి, ఫిబ్రవరి 28,(తెలంగాణ ఎక్స్ ప్రెస్):ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆదర్శ కళాశాల పరీక్ష కేంద్రాల్లో, బుధవారం నాడు ఇంటర్ ప్రథమ సంవత్సర ( సెట్ “ఏ”) తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, జి ఎఫ్ సి పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పరీక్ష కేంద్రాల సీఎస్, డీఓ లు సి హెచ్. హేమచందర్, పి.సాయిబాబా, స్వప్న, పద్మ లు తెలిపారు. “ఏ” కేంద్రంలో 289 మందికి 279 మంది హాజరు కాగా 10 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. “బి” కేంద్రంలో 255 మందికి గాను 245 మంది పరీక్షకు హాజరు కాగా 10 గురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. “ఎ , బి” రెండు కేంద్రాల్లో కలిపి 20 మంది విద్యార్థులు గైహాజరైనట్లు సీఎస్ డీఓ లు తెలిపారు. పరీక్షలను ఎలాంటి మాస్ కాపీయింగ్ కు అవకాశం లేకుండా పకడ్బందీగా నిర్వహించడం జరిగిందన్నారు. “ఎ , బి” పరీక్ష కేంద్రాల వద్ద పరీక్ష వ్రాసే విద్యార్థులకు అత్యవసర ప్రాథమిక చికిత్సల కోసం మత్తమాల పి హెచ్ సి ఎ ఎన్ ఎం లు మందులతో అందుబాటులో ఉన్నారు. పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల లోపు 144 సెక్షన్ అమలు లో ఉంది.

You may also like

Leave a Comment