Home తాజా వార్తలు చట్టసభల్లో బీసీల వాటా సాధన కోసం మహా పాదయాత్ర కరపత్ర ఆవిష్కరణ

చట్టసభల్లో బీసీల వాటా సాధన కోసం మహా పాదయాత్ర కరపత్ర ఆవిష్కరణ

by Telangana Express

ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు పోగుల సైదులు గౌడ్

మిర్యాలగూడ డివిజన్ ఫిబ్రవరి 27 తెలంగాణ ఎక్స్ ప్రెస్: తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేంద్ర గౌడ్ చట్టసభల్లో బీసీల వాటా సాధన కోసం తలపెట్టిన మహా పాదయాత్ర కార్యక్రమం యొక్క కరపత్రాలను తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు పోగుల సైదులు గౌడ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ మేమెంతో మాకు అంత నినాదంతో చట్టసభల్లో బిసి వాటా మరియు కులగణన ఆధారంగా రిజర్వేషన్ల సాధనకై రాష్ట్ర నాయకత్వం మార్చి 1వ తేదీన మీర్ గాని పల్లి గ్రామం నుండి కిలాషపూర్ కోట వరకు చేపడుతున్న మహా పాదయాత్ర కార్యక్రమాన్ని ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీ నాయకులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణ కులగణన చేపట్టి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చేపడుతున్న ఈ పాదయాత్ర ద్వారా 60 శాతం ఉన్న బీసీ జనాభాకు 15% రిజర్వేషన్లే కల్పించడాన్ని ఎండగడుతూ బీసీల హక్కుల సాధన ధ్యేయంగా ప్రజలను చైతన్యవంతులు చేస్తూ ముందుకు సాగే మానరేందర్ అన్నను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కర్నాటి శివరామకృష్ణ, సరికొండ రిషికేశ్వర రాజు, ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు పోగుల సైదులు, గౌడ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకన్న గౌడ్, రజక సంఘం రాష్ట్ర నాయకులు నల్లగంతులు నాగభూషణం, బీసీ రాష్ట్ర నాయకులు జయరాజు, రజక సంఘం పట్టణ అధ్యక్షుడు కుమ్మరి కుంట సుధాకర్, యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి చేగుండి మురళి యాదవ్ పూసల సంఘం జిల్లా అధ్యక్షులు పొదల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు రమణ, తెలంగాణ బీసీ యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షులు రామరాజు యాదవ్, మండల అధ్యక్షులు నరేష్, నాయకులు సుబ్రహ్మణ్యం, రాజు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment