Home తాజా వార్తలు దేశంలో 1835లో పత్రికా రంగం ప్రారంభానికి అడుగులు మొదలు

దేశంలో 1835లో పత్రికా రంగం ప్రారంభానికి అడుగులు మొదలు

by Telangana Express
  • అర్హులైన వారికి అందని ద్రాక్షాలా మారిన అక్రిడేషన్లు
  • అక్రిడేషన్లు కోసం డిగ్రీ ఉత్తీర్ణత అవలేద అనర్హులు పత్రిక రంగంలో ఉన్నారు
  • అడ్డదారుల్లో అక్రిడేషన్ కార్డులు కొనుగోలు చేసి విచ్చల విడిగా దందాలు

మంచిర్యాల, మార్చి 12, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): దేశంలో 1835 లోనే పత్రికారంగం అడుగులు మొదలయ్యాయి. పదేళ్ల క్రితం మీడియా జర్నలిస్టులు పదుల సంఖ్యలో ఉండేవారు. నేడు వందల సంఖ్యలో ప్రింట్ మీడియా జర్నలిస్టులు మొదలయ్యారు. జర్నలిజం నాలుగు అక్షరాల ఈ పదం చూడడానికి చిన్నగా ఉన్నా ప్రభావం రాజ్యాలను కూలగొట్టగలదు. నాయకులను మార్చగలదని, దోపిడీ వ్యవస్థను ప్రశ్నించే గొంతుకగా మారగలదని సమాజ వర్గాలు తెలియపరిచారు. ఆనాటి నుండి నేటి వరకు ఎందరో ప్రతిభావంతులైన మేధావులు జర్నలిజం అనే ఆయుధంతో స్వేచ్ఛ, స్వాతంత్య్రంకై పోరాటాలు చేసిన చరిత్ర జర్నలిస్టులది. విలేకరి ముసుగులో దందాలు చేస్తూ ఒక వేళ ఎవరైనా ధైర్యంగా ముందుకొచ్చి దుండగులు చేసే ఆగడాలను బయటకు చెప్పే సాహసం చేసినా బెదిరింపులకు పాల్పడుతూ నోరు నొక్కేస్తున్నారు. ఒకప్పుడు విలేకరి అర్హత పొందాలంటే, కనీస అర్హత పరీక్షలు క్రమశిక్షణ తో కూడిన శిక్షణలు ఉండేవి. అందుకే అనుభవం ఉన్న జర్నలిస్టులు హుందాగా వ్యవహరిస్తారు. రేషన్ డీలర్ జర్నలిస్ట్ గా, చౌక దుకాణాలలో బెల్టు షాపులలో జరిగే అక్రమాలు ప్రశ్నించకుండా మద్యం దుకాణదారుడూ జర్నలిస్ట్ గా, సిండికెట్ వ్యాపారం బయటపడకుండా ఉండాలని, కాంట్రాక్టర్ జర్నలిస్ట్ అవతారం ఎత్తి, నాసిరకపు పనులు ప్రశ్నించొద్దని, అక్రమ మట్టి, ఇసుక రవాణా చేసే వాడు, పురుగుమందు వ్యాపారస్తుడు, బెల్టు షాపు నడిపేవాడు చివరికి డిగ్రీ కూడా ఉత్త్తీర్ణత అవలేని అనర్హులు నేడు పత్రికా రంగంలో ఇబ్బడి ముబ్బడిగా తిరుగురున్నారు. చిన్న పత్రికలైనా కొన్ని పత్రికలు సమాజ శ్రేయస్సుకోసం, ప్రజల సమస్యలు నాయకుల దృష్టిలో ఉంచే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ కొందరు విలేకర్లు అక్రమ సంపాదనే లక్ష్యంగా పెట్టుకుని జర్నలిజంలోకి అడుగులు వేస్తున్నారు. ఇలాంటి ఘటనలు సీనియర్ జర్నలిస్టుల దృష్టిలో ఉన్నప్పటికీ ఇదంతా చూసి చూడనట్లే వ్యవహరిస్తున్నారు. పత్రికా స్వేచ్ఛ ను హరించే హక్కు లేదన్నది ముమ్మాటికీ వాస్తవమే, అయినప్పటికీ పత్రికా రంగంలో ఉన్న ప్రతీ ఒక్కరూ విలువలు కోల్పోకుండా పనిచేయాలి. నిజానికి అలా జరగడంలేదు కారణం ప్రశ్నించే హక్కున్నవారే మిన్నకుంటున్నారు. అక్రమార్కులతో చేతులు కలిపి జర్నలిజాన్ని కూడా కలుషితం చేయడంతో రోజు రోజుకీ విలేకరులంటే చిన్న చూపు ఎక్కువైపోతుంది. అక్రిడేషన్ కార్డులు అడ్డదారులలో కొనుగోలు చేసి కొందరు అదేదో బ్రహ్మాస్త్రంగా భావించి విచ్చల విడిగా దందాలు చేస్తూ అధికారులను సైతం బురిడీ కొట్టిస్తున్నారు. అసలు ఎటువంటి అర్హత లేని వారి చేతికి అక్రిడేషన్ కార్డులు అమ్ముకుంటున్న కొన్ని మీడియా సంస్థలకు వాటిని అసలు వాళ్లు ఎందుకు వాడుతున్నారు. అనేది తెలుసా అసలు, ఐనా వారికి ఎందుకులే మనం అమ్ముకున్నాం వాడు దానితో ఏమి చేస్తే నాకెందుకు అనుకుంటున్నాయి, సదరు మీడియా సంస్థలు. అధికారులు కూడా ఇలాంటి వారిపై నిఘా ఏర్పాటు చేయకపోవడం వలన వీరి ఆగడాలు రోజురోజుకూ శృతిమించి పోతున్నాయి. అర్హత ఉన్న వారికి దక్కని అక్రిడేషన్ కార్డులు అక్రమార్కులకు మాత్రం చాలా సులువుగా అందడంపై సీనియర్ విలేఖరులను బాధిస్తున్న విషయం. సంభందిత శాఖల అధికారులు స్పందించి అసలు విలేఖరులు ఎవరు నకిలీ విలేఖరులు ఎవరు అనే నిజాన్ని సమాజానికి తెలియపరిస్తే నిజమైన జర్నలిజాన్ని కాపాడిన వారవుతారు అనేది సమాజంలో జరిగే నిజాన్ని నిర్భయంగా వ్రాసే సీనియర్ విలేకరులు, చిన్న పత్రికల జర్నలిస్టులు నూటికి నూరుశాతం నిజమాని గుసగుసలాడుకుంటున్నారు. రాష్ట్రంలో చిన్న పత్రికల విలేకరు లకు అక్రిడేషన్ సీనియర్ విలేకరులకు అన్ని అర్హతలు ప్రభుత్వం ప్రకటిస్తున్నారో, అదేవిధంగా ప్రభుత్వం ద్వారా చిన్న పత్రికల జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు లేకున్నా అందించే ఉచిత భూమిని, ఇందిరమ్మ ఇళ్లను, ప్రభుత్వం మంజూరు చేయాలి. ఇప్పటికైనా స్పందించి చిన్న పత్రికల పిడిఎఫ్ ద్వారా వచ్చిన ప్రకటనను, ఆ పత్రిక ప్రకటనకు వార్తను వేంటనే ప్రభుత్వ అధికారులు దర్యాప్తు చేపట్టి చట్ట ప్రకారం న్యాయం చేయాలి.

You may also like

Leave a Comment