Home తాజా వార్తలు గ్రామ శివారు నుండి ట్రాక్టర్ తో అక్రమ ఇసుక రవాణా

గ్రామ శివారు నుండి ట్రాక్టర్ తో అక్రమ ఇసుక రవాణా

by Telangana Express

మంచిర్యాల, జనవరి 30, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): కవ్వాల్ అడవి ప్రాంతం మంచిర్యాల జిల్లా, జన్నారం మండలం, పొనకల్ మేజర్ గ్రామపంచాయతీ గ్రామ శివారు వాగు నుండి ట్రాక్టర్ తో ప్రభుత్వ అధికారులకు తెలియకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు. గత మూడు రోజుల నుండి పాత పోనకల్ గ్రామం శివారు మండల ఎంపీపీ వ్యవసాయ పొలం సమీపంలో కవ్వాల్ అటవీ ప్రాంతం వాగు నుండి ప్రభుత్వ అనుమతి లేకుండా ట్రాక్టర్ తో ఇసుక తరలించడం జరుగుతుంది. మండలంలోని పోనకల్ మేజర్ గ్రామపంచాయతీ పాత పోనకల్ అటవీ ప్రాంతం నుండి వస్తున్న నీరు వాగు ద్వారా గోదావరిలోకి వెళ్లడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో అధిక వర్షాలకు అటల్ ప్రాంతం నుండి వస్తున్న నీటి వరదతో ఇసుక వాగులో వచ్చి మెటూ వేయడమైంది. గత మూడు రోజుల నుండి పోనకల్ గ్రామపంచాయతీ పాత పోనకల్ సమీపం దెయ్యాల చింతం ప్రాంతం నుండి ట్రాక్టర్ తో ప్రభుత్వ అధికారులకు తెలియకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు. ట్రాక్టర్ తో ఇసుక తీయడం చేత రాబోయే ఎండాకాలంలో గ్రామా బావిలలో భూగర్భ జలాలు అడుగంటిపోయే అవకాశం ఉందని గ్రామ వాసులు ప్రభుత్వ అధికారులైన జన్నారం మండల తాసిల్దార్, మంచిర్యాల జిల్లా మైనింగ్ అధికారులను కోరుచున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి, ప్రభుత్వ అధికారుల అనుమతి లేకుండా అటవి ప్రాంతం, ఓర్రెలు, వాగులు, గోదావరి, నుండి ట్రాక్టర్లు ద్వారా ఇసుక తరలించకుండా ప్రభుత్వం కవ్వాల్ అటవీశాఖ, మండల రెవెన్యూ శాఖ, జిల్లా మైనింగ్ శాఖ, స్థానిక పోలీసులు ట్రాక్టర్లకు పూర్తి ప్రభుత్వ పత్రాలు ఉన్నాయా, తనిఖీ చేయాలని, గ్రామ ప్రజలు కోరుతున్నారు.

You may also like

Leave a Comment