Home తాజా వార్తలు ఆయిల్ పామ్ సాగు తో అధిక ఆదాయం

ఆయిల్ పామ్ సాగు తో అధిక ఆదాయం

by Telangana Express

సందర్శించిన జగదేవపూర్ మండల నబీనగర్ ఆయిల్ పామ్ తోటలు.

జగడేవపూర్: నవంబర్ : 28, (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

జగదేవపూర్ మండలం నబీ నగర్ గ్రామంలో మండల వ్యవసాయ అధికారి వసంత రావు ఆయిల్ పామ్ సాగు ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగు వల్ల అధిక ఆదాయం లభిస్తుందని మండల వ్యవసాయ అధికారి అన్నారు. మండలంలో ఇప్పటివరకు సుమారు 600 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టడం జరిగిందని అన్నారు. గురువారం జగదేవ్పూర్ గ్రామంలో ఆయిల్ పామ్ సాగు, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, సాగులో మెలకువలు పై రైతులకు అవగాహన కల్పించారు. మొదటి 3 సంవత్సరాల వరకు అంతర పంటల సాగుతో ఆదాయం సమకూరుతుందని, నాలుగో సంవత్సరం నుండి ఆయిల్ పామ్ గెలలు చేతికి వచ్చి ఆదాయం మొదలవుతుందని చెప్పారు. ఈ ఆయిల్ పామ్ సాగు లో చీడపీడల బెడద కూడా తక్కువేనని తెలిపారు. జగదేవపూర్ గ్రామంలో ఆయిల్ పామ్ తోటలో కంది అంతర పంటగా సాగు చేస్తున్న రైతు బీరోల్ల సైదులు గారి తోటను సందర్శించి తగు సూచనలు చేశారు. ఆయిల్ పామ్ సాగు ఆసక్తి ఉన్న రైతులు స్థానిక వ్యవసాయ విస్తీర్ణ అధికారులను సంప్రదించి తమ వివరాలు నమోదు చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ ఆఫీసర్ విజయ్, వ్యవసాయ విస్తీర్ణ అధికారి ఖలీల్ మరియు రైతులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment