Home తాజా వార్తలు పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటువేసి ఆశీర్వదించాలి :ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి

పట్టభద్రులు మొదటి ప్రాధాన్యత ఓటువేసి ఆశీర్వదించాలి :ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి

by Telangana Express

మిర్యాలగూడలో వాకర్స్ తో మీట్..షటిల్, క్రికెట్ ఆడినారు..

మిర్యాలగూడ మే 21 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టబద్రులు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆశీర్వదించాలని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కోరారు.

మంగళవారం ఉదయం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం, ఎన్ఎస్పి క్యాంపు మైదానంలో ఎన్.బి.ఆర్. ఫౌండేషన్ చైర్మన్, బిఆర్ఎస్ యువనేత నల్లమోతు సిద్ధార్థ, బిఆర్ఎస్ నాయకులు, అభిమానులతో కలిసి వాకర్స్ తో ముచ్చటించారు.

విద్యావంతుడినైనా తనకు ఒక అవకాశం ఇవ్వాలని, ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు అన్నభీమోజు నాగార్జున చారి, శ్రీనివాస్ యాదవ్, బిఆర్ఎస్వి.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం డి షోయబ్, జొన్నలగడ్డ రంగారెడ్డి, పశ్య శ్రీనివాస్ రెడ్డి, రవి నాయక్, దినేష్, మన్నెం శ్రీనివాస్ రెడ్డి, పూనాటి లక్ష్మీనారాయణ, కృష్ణ, కరీం, హబీబ్, తిరందాసు విష్ణు, గుడిసె దుర్గ ప్రసాద్, రామస్వామి, గౌస్, ఆకారపు సైదులు, మాజీ సర్పంచ్ రవీందర్ నాయక్, ఫయాజ్, రాంబాబు, ఇమ్రాన్, శ్రవణ్ రెడ్డి, ఆసిమ్, తదితరులు పాల్గొన్నారు.

కళాశాల మైదానంలో ఫిజికల్ డైరెక్టర్లు వెంకటేశ్వర్లు యాదవ్, వెంకటరత్నం, ఇక్బాల్, కొండూరు శ్రీనివాస్, తదితరులతో ముచ్చటించారు. క్రీడాకారులతో కొద్దిసేపు షటిల్, క్రికెట్ ఆడినారు.

You may also like

Leave a Comment