Home తాజా వార్తలు గోపాలరావ్ పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భైంసాలో ఘనంగా

గోపాలరావ్ పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భైంసాలో ఘనంగా

by Telangana Express

“జాతీయ న్యాయ దినోత్సవం “
తెలంగాణ ఎక్స్ ప్రెస్ 26/11/24
భైంసా పట్టణం లోని
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కర్రోల్ల బుచ్చయ్య గారు మాట్లాడుతూ రాజ్యాంగ మౌలిక లక్ష్యం సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందరికీ అందించడం రాజ్యాంగ లక్ష్మమని భారత రాజ్యాంగానికి ఎంతో విశిష్టత ఉందని పరిపాలన అంశాలు కాకుండా స్వేచ్ఛ, సమానత్వం ,ఆర్థిక బేధాలు వివక్ష లేకుండా ప్రజలను దేశంగా కలిపి ఉంచడంలో రాజ్యాంగానిది ఎంతో కీలక పాత్రయని 1949 నవంబర్ 26 భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. అయితే భారత రాజ్యాంగంలో న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం పొందుపరిచ బడ్డాయి దేశంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగం విలువలపై అవగాహన కల్పించవలసిన ఆవశ్యకతను తెలియజేస్తూ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ప్రజాస్వామ్యం జాతీయ సమైక్యత సూత్రాలను పటిష్టం చేస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్ కు చేసిన కృషిని స్మరిస్తూ ఈ రోజున న్యాయాన్ని కాపాడుతామని న్యాయవాదులు, పౌరులు, విద్యార్థులు ప్రతిజ్ఞ చేయడం జరుగుతుందని న్యాయం అనేది ప్రతి పౌరుడికి అందించవలసిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని కనుక విద్యార్థులు రాజ్యాంగాన్ని చదవవలసిన ఆవశ్యకత తప్పనిసరి అని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎన్ ఏస్ నయల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆరె.రాజు, డా.జాదవ్ ఓం ప్రకాష్ మరియు అధ్యాపకులు రఘునాథ్ డా పవన్ కుమార్ రవికుమార్ డా పీజీ రెడ్డి గుంత సుధాకర్ డా.శంకర్ డా .సంతోష్ కుమార్ డా.నహేదా,డా .కల్పన ,రామ్మోహన్ ప్రవీణ్ లాల్ ఇతర అధ్యాపకులు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులు . ఎన్ ఎన్.ఏస్ ఎవాలంటీర్స్ ప్రతిజ్ఞను చేయడం జరిగింది.

You may also like

Leave a Comment