Home తాజా వార్తలు ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి

ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి

by Telangana Express

1000 కోట్లతో నిధులతో అభివృద్ధి చేసి చూపిస్తా.

బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి.

కుటుంబాన్ని వదిలి, 15 ఏండ్లుగా ప్రజలలో తిరుగుతున్నారు ..

ఈ ప్రాంత అభివృద్ధికి , ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి.

ఎమ్మెల్సీ సతీమణి పాడి శాలిని రెడ్డి.

వీణవంక, నవంబర్ 8( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం లోని వీణవంక మండలం బ్రాహ్మణపల్లి, మల్లన్న పల్లి, గన్ముకుల, రెడ్డిపల్లి గ్రామాలలో బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రచారాన్ని ఘనంగా జరిగింది. గ్రామ గ్రామాన మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి, మంగళ హారతులు పడుతూ , కోలాటం నృత్యాలు చేస్తూ, పూలమాలవేసి గ్రామ గ్రామాన బిఆర్ఎస్ నాయకులకు ఘన స్వాగతం పలికారు. గ్రామాలలో ఓటర్లను ఉద్దేశించి ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ఒక్కసారి నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి అని,కెసిఆర్ ను ఒప్పించి 1000కోట్ల నిధులు తెస్తా,70 కోట్లతో కలువల ప్రాజెక్ట్ కటిస్తా,మెజారిటీ ఇస్తే గన్ముకుల, రెడ్డిపల్లి గ్రామాలను దత్తత తీసుకుంటా,చెప్పినవి చేయకుంటే ఓట్ల కోసం మళ్ళీ మీ ముందుకు రానని,తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు వెళుతున్నానని, నేను మీ ఆశీర్వాదం కోసం వచ్చాను నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని హుజురాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.


అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వీణవంక మండలంలోని బ్రాహ్మణపల్లి, మల్లన్నపల్లి, గన్ముకుల, రెడ్డిపల్లి గ్రామాలలోని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నా రెండు చేతులు జోడించి అడుగుతున్న ఒక్క అవకాశం ఇవ్వండి హుజురాబాద్ అభివృద్ధి చేసి హుజురాబాద్ రూపు రేఖలు మార్చి చూపిస్తానని అన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు హుజురాబాద్ అభివృద్ధి సరిగా జరగలేదని, 2021 అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. దేశంలో ఎక్కని లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత కరెంటుతో పాటు 19 వేల కోట్లతో రుణమాఫీ కూడా చేశారనిబి అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాడని, కొత్త మేనిఫెస్టోలో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయనున్నారని అన్నారు.

ఇందులో ముఖ్యంగా మహిళల కోసం సౌభాగ్య లక్ష్మి పేరిట అర్హులైన మహిళలందరికీ నెలకు 3000 చూపున ఇవ్వనున్నామని, అలాగే గ్యాస్ సిలిండర్ కూడా 400 కి అందిస్తామన్నారు. అన్నపూర్ణ పేరుతో సన్న బియ్యం అందించనున్నామని, ఆరోగ్యశ్రీని కూడా 5 లక్షల నుంచి 15 లక్షలకు పెంచుతామన్నారు. అలాగే కెసిఆర్ ధీమా ఇంటింటికి బీమా అనే పథకం ద్వారా రేషన్ కార్డు ఉన్న వారి కుటుంబంలో ఎవరైనా పోషకులు మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షలు అందజేస్తామన్నారు. ప్రస్తుతం 2000 ఉన్న పెన్షన్ 5 వేలకు చేస్తామని 4000 ఉన్న వికలాంగుల పెన్షన్ దఫాలవారీగా 6000 చేస్తామని అన్నారు. గత 15 సంవత్సరాలుగా నియోజకవర్గంలోనే ఉంటూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. ఈసారి ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ధిలో హుజురాబాద్ రూపురేఖలు మార్చి చూపిస్తానని అన్నారు. 70 కోట్ల వ్యయంతో కల్వల ప్రాజెక్టు కట్టిస్తానని హామీ ఇచ్చారు.ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరికి వెళ్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం వెయ్యి కోట్ల నిధులు తీసుకువచ్చి సిద్దిపేట తరహాలో హుజురాబాద్ అభివృద్ధి చేసుకుంటామనని అన్నారు. గన్ముకుల, రెడ్డిపల్లి గ్రామాలలో భారీ మెజారిటీ ఇస్తే రెండు గ్రామాలను దత్తత తీసుకొని చక్కటి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.గృహలక్ష్మి బిసి బంధు పెట్టుకున్న వారందరికీ ఎన్నికల అనంతరం చెక్కుల పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడున్న ఎమ్మెల్యేకు ఏడుసార్లు ఓటు వేసి 20 సంవత్సరాలు ఎమ్మెల్యే గా అవకాశం కల్పించిన అభివృద్ధి చేయలేదని, తనకు ఒక్క అవకాశం కల్పిస్తే హుజురాబాద్ ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని అన్నారు. ఒకవేళ నేను చెప్పిన చేయకపోతే ఓటు కోసం మరోసారి మీ ముందుకు రానని అన్నారు మీ అందరి ఆశీస్సులు ఎప్పటికీ ఇలా ఉండాలని అన్నారు. ఇదే అభిమానాన్ని ఎన్నికల వరకు కొనసాగించి తన గెలుపుకు కృషి చేస్తే రాబోయే రోజుల్లో మీరు ఆశించిన దానికంటే ఎక్కువగా పనిచేసి మీ రుణం తీర్చుకుంటానని అన్నారు. మూడోసారి కూడా తెలంగాణలో గులాబీ జెండా ఎగరబోతుందని అందరికీ తెలుసని అన్నారు. రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం తధ్యమని అన్నారు. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బిఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే ఇక్కడున్న సమస్యలన్నిటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు తీసుకువచ్చి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ని ఒప్పించి 1000కోట్ల నిధులు తీసుకువచ్చి హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చేసుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. వేరువేరుగా జరిగిన ఈ ప్రచార కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ సతీమణి శాలిని రెడ్డి, ఎంపీపీ రేణుక తిరుపతిరెడ్డి, జడ్పిటిసి వనమాల సాధవరెడ్డి, వైస్ ఎంపీపీ లత శ్రీనివాస్, మాజీ మార్కెట్ చైర్మన్ బాలకిషన్ రావు, గ్రామాల సర్పంచులు సునీత మల్లారెడ్డి, పోతుల నరసయ్య, కాంత రెడ్డి, సారయ్య, రమేష్,ఎంపిటిసిలు నాగిడి సంజీవరెడ్డి, లక్ష్మీ భూమయ్య, ఫ్యాక్స్ డైరెక్టర్లు మధుసూదన్ రెడ్డి, కిషన్ రెడ్డి, మర్రి స్వామి,శ్రీనివాస్ రెడ్డి,వీణవంక ఉప సర్పంచ్ భానుచందర్,గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, బి ఆర్ ఎస్ నాయకులు రాధాకృష్ణ, తిరుపతి,మధు, మధుకర్ రెడ్డి,తిరుపతి రెడ్డి, శ్రీనివాసరెడ్డి, గెల్లు మల్లయ్య యాదవ్, యాసీన్, వీరన్న గ్రామ శాఖ అధ్యక్షులు సంపత్ యాదవ్, రాజయ్య, నాలుగు గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like

Leave a Comment