Home తాజా వార్తలు *ప్రత్యేక పూజలు చేసిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి దంపతులు

*ప్రత్యేక పూజలు చేసిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి దంపతులు

by Telangana Express

మిర్యాలగూడ జనవరి 10 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

మిర్యాలగూడ మండలం
యాదగర్ పల్లి గ్రామంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి, పార్వతి వర్ధిని సమేత అభిష్తేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు, అభిషేకాలు నిర్వహించి ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కర్త మిర్యాలగూడ మాజీ మార్కెట్ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి – మమత కుటుంబసమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. వారి వెంట మాజీ సర్పంచ్ దుండిగల యాదమ్మ శ్రీనివాస్ కర్ణాకర్ రెడ్డి సతీష్ రెడ్డి గోపి యాదగిరి రెడ్డి మాజీ ఉపసర్పంచ్ సుగుణ నాగేందర్ ఎల్లయ్య రవి ఆంజనేయులు వెంకన్న అశోక్, గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment