మిర్యాలగూడ మార్చి 13 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని అశోక్ నగర్ చెందిన మాజీ కౌన్సిలర్, హైదరాబాద్ లోని ప్రముఖ అమ్మ హాస్పిటల్ డైరెక్టర్ ఎం.ఎం. ఖాన్. గురువారం తెల్లారుజామున మృతి చెందినట్లు వారి బంధువులు పేర్కొన్నారు. ఎం.ఎం. ఖాన్ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడుతో ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి 23 వ వార్డ్ తాజా మాజీ కౌన్సిలర్, టిఆర్ఎస్ పురపాలక సంఘం మాజీ ఫ్లోర్ లీడర్ ఇలియాస్ ఖాన్ తెలియజేశారు.ఎం.ఎం. ఖాన్ మృతి పట్ల మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లేష్ సీనియర్ జర్నలిస్టులు ఖాజ హామీదుద్దీన్, ఎండి అస్లాం, రంగ శ్రీనివాస్, అయూబ్, జంగా లక్ష్మణ్ యాదవ్, మంద సైదులు బొంగారల మట్టయ్య, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఆకారపు సైదులు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.