మంచిర్యాల, ఫిబ్రవరి 17, (తెలంగాణ ఎక్స్ ప్రెస్): మంచిర్యాల జిల్లా, తాండూర్ మండలంలో బిఆరెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను, శనివారం తాండూర్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ2001 నుంచి 2009 వరకు రాష్ట్ర సకల జనుల సమ్మెలు, ఎంతోమంది యువకులు అమరులైన, ఉద్యమ నేత కేసీఆర్ పోరాటాల వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. 2014 సంవత్సరంలో నూతనంగా తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసిఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాలన కొనసాగించారన్నారు. రాబోయే ఎన్నికలలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆరోగ్యాలతో జీవించి దేశ రాజకీయాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి బాణయ్య, ఎంపీపీ ప్రణయ్ కుమార్, సింగిల్ విండో చైర్మన్ దత్తుమూర్తి, ఎంపిటిసిలు, మాజీ సర్పంచులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ జన్మదిన వేడుకలు
40